సాఫ్ట్బ్యాంక్ నష్టం రూ.9000 కోట్లు
సబ్సిడరీలు, అసోసియేట్ల షేర్లు విలువ నష్టాలతో 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మేర కంపెనీకి నష్టాలొచ్చాయని సాఫ్ట్ బ్యాంకు తెలిపింది. దానిలో స్నాప్ డీల్ మాతృ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ ప్ర
భారత్ లో పెట్టుబడులతో జపనీస్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు గ్రూప్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను 1.4 బిలియన్ డాలర్లు లేదా 9000 కోట్లకు పైగా నష్టాలు వచ్చినట్టు ఈ గ్రూప్ వెల్లడించింది. ముఖ్యంగా భారత స్టార్టప్ కంపెనీలు స్నాప్ డీల్, ఓలా కారణంగా సాఫ్ట్ బ్యాంకుకు ఈ మేర నష్టాలొచ్చినట్టు పేర్కొంది.
సబ్సిడరీలు, అసోసియేట్ల షేర్లు విలువ నష్టాలతో 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1 బిలియన్ మేర కంపెనీకి నష్టాలొచ్చాయని సాఫ్ట్ బ్యాంకు తెలిపింది. దానిలో స్నాప్ డీల్ మాతృ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న స్టార్ ఫిష్ ఐ పీటీఈ లిమిటెడ్ ముఖ్యమైందని తెలిపింది. అంతేకాక భారత్ లో తన రెండో అతిపెద్ద పెట్టుబడుల సంస్థ ఓలా వల్ల కూడా 400 మిలియన్ డాలర్లు నష్టపోయినట్టు పేర్కొంది. దీంతో స్నాప్ డీల్, ఓలా వల్ల ఫేర్ వాల్యు వద్ద 1.4 బిలియన్ డాలర్ల నష్టాలను నమోదుచేసినట్టు వెల్లడించింది.
మొట్టమొదటిసారి ఆగస్టు 2013లో స్నాప్డీల్లో సాఫ్ట్బ్యాంక్ ఒక పెట్టుబడిదారుగా చేరింది. మొత్తానికి ఇప్పటివరకూ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలో 800మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్టు తెలిసింది. స్నాప్డీల్ విషయంలో వచ్చిన అనుకోని నష్టాలతో ప్రస్తుతం దాన్ని ఫ్లిప్కార్ట్కు అమ్మేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ-కామర్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.