అమెరికా దాడి వార్తలతో నష్టాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ వారం కనిష్ట స్థాయికి వెళ్లింది. సిరియాపై అమెరికా క్షిపణుల దాడికి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో యూరప్, ఆసియా మార్కెట్లు నష్టాలబాట పట్టగా.. ఆ ప్రభావం దేశీయ
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల కారణంతో చివరి గంటలో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు రోజు కనిష్టంలో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 221 పాయింట్లు కోల్పోయి 29,707 వద్ద నిలవగా... నిఫ్టీ 63.65(0.69%)పాయింట్లు నష్టోయి 9198.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్ వారం కనిష్ట స్థాయికి వెళ్లింది. సిరియాపై అమెరికా క్షిపణుల దాడికి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. దీంతో యూరప్, ఆసియా మార్కెట్లు నష్టాలబాట పట్టగా.. ఆ ప్రభావం దేశీయంగానూ పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే హెల్త్కేర్(1.43%), లోహ(1.24%), స్థిరాస్తి(1.19%), బ్యాంకింగ్( 0.96) నష్టపోగా; మరో వైపు చమురు, సహజ వాయు రంగం(0.48%), మూలధన వస్తు రంగం 0.10శాతం లాభపడ్డాయి.
సెన్సెక్స్లో లాభపడిన వాటిలో టీసీఎస్(+1.14%), బజాజ్ ఆటో(+1.01%), భారతీ ఎయిర్టెల్(0.83%), హీరో మోటోకార్ప్(0.58%),ఎన్టీపీసీ( (+0.27%) ఉండగా; నష్టపోయిన వాటిలో సన్ ఫార్మా (-3.04%), లుపిన్ (-2.61%), అదానీ పోర్ట్స్ (-2.37%), రిలయన్స్ (-2.28%) మరియు డాక్టర్ రెడ్డీస్ (-1.97%) నష్టపోయిన వాటిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications