ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ స్నాప్డీల్ తన డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫ్రీఛార్జ్కు సీఈవోగా జాసన్ కొఠారిని నియమించింది. దీంతో పాటు కొఠారి స్నాప్డీల్లోని చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ స్నాప్డీల్ తన డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫ్రీఛార్జ్కు సీఈవోగా జాసన్ కొఠారిని నియమించింది. దీంతో పాటు కొఠారి స్నాప్డీల్లోని చీఫ్ స్ట్రాటజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా కొనసాగనున్నారు. అంతేగాక ఫ్రీఛార్జ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరుగా వ్యవహరించనున్నారు. ఇంతకుముందు బాధ్యతలు నిర్వర్తించిన గోవింద రాజన్ స్థానంలో జాసన్ కొత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు.
2015 ఏప్రిల్లో ఫ్రీఛార్జ్ను స్నాప్డీల్ కొనుగోలు చేసింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఫ్రీఛార్జ్ను కూడా విస్తరించేందుకు స్నాప్డీల్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతోంది. 2025 నాటికి కేవలం డిజిటల్ చెల్లింపుల్లోనే భారత్ 1 ట్రిలియన్ లావాదేవీల స్థాయికి ఎదగనుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ చెల్లింపుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకోవడంలో భాగంగానే స్నాప్డీల్ యాజమాన్యం కొఠారిని సీఈవోగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఫ్రీఛార్జ్లో అదనంగా మరో 20 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు స్నాప్డీల్ తెలిపింది. కొఠారి గతంలో సాఫ్ట్బ్యాంక్కు చెందిన ఆన్లైన్ రియల్ ఎస్టేట్ కంపెనీ హౌసింగ్.కామ్కు సీఈవోగా వ్యవహరించారు. ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయానికి 8 ఉత్తమ మార్గాలు
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications
