ఇప్పటివరకు జీపీఎఫ్ చందాదారులు తమ పిల్లల కోసం ఉన్నత విద్య కోసమే ఈ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యకు సంబంధించి దేనికైనా జీపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునే అవ
కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే
దాదాపు 50 లక్షలకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త. ఉద్యోగ భవిష్య నిధి(జీపీఎఫ్) నుంచి డబ్బులు విత్డ్రా చేసేందుకు ఉద్దేశించిన నియమాలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. కేవలం 15 రోజుల్లోపే ఈ మొత్తాన్ని ఉద్యోగులు విత్డ్రా చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పదిహేనేళ్ల సర్వీసు పూర్తయితే తప్ప జీపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండేది కాదు. తాజా నిబంధనల ప్రకారం ఈ గడువును పదేళ్లకు కుదించారు. అలాగే ఇప్పటివరకు జీపీఎఫ్ చందాదారులు తమ పిల్లల కోసం ఉన్నత విద్య కోసమే ఈ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యకు సంబంధించి దేనికైనా జీపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నారు. అలాగే నిశ్చితార్థం, వివాహం, అస్వస్థత(అనారోగ్య చికిత్స) తదితర ముఖ్య అవసరాల నిమిత్తం కూడా జీపీఎఫ్ నుంచి నిధులను తీసుకునే అవకాశాన్ని కల్పించింది.

ప్రభుత్వోద్యోగులనుంచి వచ్చిన సలహాలు, వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని జీపీఎఫ్ నిబంధనల్లో మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆయా చందాదారుల ఖాతాలో వుండే మొత్తంలో నాలుగింట మూడోవంతు లేదా 12 నెలల జీతాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుందని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. అస్వస్థతకు సంబంధించి 90 శాతం వరకు జీపీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే పదేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత సదరు చందాదారు తన ఖాతాలో వున్న మొత్తాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ మొత్తాలను గరిష్ఠ స్థాయిలో పదిహేను రోజుల్లోపే చెల్లించడం జరుగుతుందని కూడా ఈ ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications