ఆరు రోజుల వ‌రుస లాభాల‌కు సోమ‌వారం చెక్‌

మార్చి డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ఉద‌యం ప్రారంభం నుంచి ఒడిదుడుకుల మధ్య కొన‌సాగింది. మార్కెట్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్‌ 80 పాయింట్లు క్షీణించి 28,813 వద్

మార్చి డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ఉద‌యం ప్రారంభం నుంచి ఒడిదుడుకుల మధ్య కొన‌సాగింది. మార్కెట్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్‌ 80 పాయింట్లు క్షీణించి 28,813 వద్ద నిలవగా.. నిఫ్టీ 43 పాయింట్లు తగ్గి 8,897 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 8,900 దిగువన ముగిసింది. అయితే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోసారి లాభాల ప‌రుగు ద్వారా 8 ఏళ్ల గరిష్టానికి చేరింది. గత వారం 11 శాతం దూసుకెళ్లిన ఈ షేరు తాజాగా దాదాపు 5 శాతం ఎగసింది. రూ. 1238 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్ల నష్టాలు పరిమితమయ్యాయి.
రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్‌, టెలికం షేర్లలో అమ్మకాలు చోటుచేసుకున్నాయి. రిలయన్స్‌ జియో నుంచి పెరిగిన పోటీ, వొడాఫోన్‌లో ఐడియా విలీనం, టెలినార్‌ను కొనుగోలు చేయనున్న భారతీ వంటి అంశాల నేపథ్యంలో టెలికం కౌంటర్లు అమ్మకాలతో బలహీనపడ్డాయి.
ఎన్‌ఎస్‌ఈలో నేడు రిలయన్స్‌, అరబిందో ఫార్మా, లుపిన్‌, హెచ్‌యూఎల్‌, విప్రో తదితర కంపెనీలు లాభపడ్డాయి. ఐడియా సెల్యూలార్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, భారతి ఎయిర్‌టెల్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

 న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+