2 లక్షల రూపాయలకు పైన చేసే నగదు కొనుగోళ్లు, రూ. 50 వేల పైన విత్డ్రాయల్స్కు పాన్ను తప్పనిసరి చేయడంతో చాలా మందికి పాన్ అవసరం ఎంతగానో ఉంటోంది. దీంతో సత్వరమే పాన్ కావాలని ఎదురుచూసే వారి
2 లక్షల రూపాయలకు పైన చేసే నగదు కొనుగోళ్లు, రూ. 50 వేల పైన విత్డ్రాయల్స్కు పాన్ను తప్పనిసరి చేయడంతో చాలా మందికి పాన్ అవసరం ఎంతగానో ఉంటోంది. దీంతో సత్వరమే పాన్ కావాలని ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువయింది. ప్రభుత్వ డిజిటల్ ఇండియాలో భాగంగా అన్నీ వేగవంతమైపోతున్నాయి. ఆ జాబితాలో ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు చేరిపోయాయి. ఇక నుంచి స్మార్ట్ఫోన్ ద్వారా పాన్కార్డు సాధించేలా ఆదాయపు పన్ను శాఖ ప్రయత్నాలు చేస్తోంది.ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈ-కేవైసీ ద్వారా పాన్ జారీకి యోచన
ఈ-కేవైసీ ద్వారా సిమ్ కార్డు ఇస్తున్నప్పుడు పాన్ ఎందుకు జారీ చేయకూడదని ఐటీ శాఖ ఆలోచించింది. దానిని త్వరలో ఆచరణలోకి తీసుకురానున్నట్లు సీబీడీటీతో సంబంధం ఉన్న ఒక అధికారి వెల్లడించినట్లు పీటీఐ పేర్కొంది. ఈ విధంగా చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి పాన్ కార్డులు జారీచేయటం ద్వారా ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావచ్చనేది ప్రభుత్వ యోచనగా కనిపిస్తోంది.

యాప్ ద్వారా పన్ను కట్టొచ్చు!
యాప్కు సంబంధించిన కసరత్తు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఈ యాప్ ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లోనే పన్ను కట్టొచ్చు, ట్యాక్స్ రిటర్నులను ట్రాక్ చేసేందుకు సైతం వీలు ఉంటుంది. ఇప్పటి దాకా పాన్ లేకుండా ఉన్న వారు పన్ను రిటర్నులను సత్వరమే తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్లోనే పాన్ కార్డు దరఖాస్తును చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాలను వెల్లడించిన ఒక అధికారి వీటన్నింటికి ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉందని చెప్పారు.

ఆధార్ సాయంతో పారదర్శకంగా, వేగంగా
ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 113 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. కొత్త సిమ్ కార్డులు జారీ చేసేటప్పుడు విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్యను ఆధారంగా చేసుకుని సిమ్ కార్డులను జారీ ప్రక్రియను వేగవంతం చేశారు. అంతే కాకుండా బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసి సబ్సిడీల లీకేజీలను అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ విధానం ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాలకే నగదు బదిలీ చేసే విధానం ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి శాఖ ఆధార్ ద్వారా తమ పనులను ఎంత వేగంగా, పారదర్శకంగా చేయొచ్చో పరిశీలిస్తున్నాయి.

ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా
జనవరి 1 నుంచి ఐటీ శాఖ అదనపు సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన పాన్ కార్డులను జారీ చేస్తోంది. దాని పైన రాతలు ఆంగ్లంలోనూ, హిందీలోనూ ఉండే విధంగా కొత్త కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు కోసం మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా నేరుగా ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. చెల్లింపును సైతం నెట్బ్యాంకింగ్, కార్డుల ద్వారా జరపొచ్చు. యాప్ ద్వారా మరింత వేగంగా జారీ అయ్యే పాన్ కార్డు సత్వరమే రావాలని ఆశిద్దాం.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications