శాఖలోకి వచ్చే ఖాతాదారులకు స్వాగతం తెలపడంతోపాటు వారు ఏ సేవనైతే పొందాలనుకుంటారో అందుకు సంబంధించిన కౌంటర్ వివరాలను ఈ రోబో తెలియజే స్తుంది. అంతేకాకుండా ఆ కౌంటర్ వద్దకు వినియోగదారును తీసుకువెళుతుంది.
ప్రైవేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు మనిషి రూపంలో ఉన్న హ్యూమనాయిడ్తో వినియోగదారు సేవలను అందుబాటులోకి తెచ్చింది. ముంబైలోని కమలా మిల్స్ శాఖలో దీని సేవలను శుక్రవారం రోజు ప్రారంభించారు. దీనికి ఇరా అనే పేరుపెట్టారు. శాఖలోని వెల్కమ్ డెస్క్ వద్ద ఈ హ్యూమనాయిడ్ను ఉంచుతారు. శాఖలోకి వచ్చే ఖాతాదారులకు స్వాగతం తెలపడంతోపాటు వారు ఏ సేవనైతే పొందాలనుకుంటారో అందుకు సంబంధించిన కౌంటర్ వివరాలను ఈ రోబో తెలియజే స్తుంది. అంతేకాకుండా ఆ కౌంటర్ వద్దకు వినియోగదారును తీసుకువెళుతుంది. ఖాతాదారు సంబంధిత కౌంటర్ వద్దకు చేరుకోగానే రోబో తానున్న చోటుకు వెనక్కు వెళ్లిపోతుంది.

మొదటి విడతలో భాగంగా నగదు డిపాజిట్, పారిన్ ఎక్స్ఛేంజ్, రుణాలు తదితరాలకు సంబంధించిన కౌంటర్ల వివరాలను ఇది తెలియజేస్తుందని, తర్వాత విడతలో కస్టమర్ వాయిస్, ఫేస్ రికగ్నిషన్, వాయిస్ ఆధారిత నావిగేషన్, నగదు నిల్వకు సంబంధించిన వివరాలు, చెక్ డిపాజిట్ తదితర సర్వీసులను ఈ రోబో ద్వారా అందించనున్నట్టు బ్యాంకు కంట్రీ హెడ్ (డిజిటల్బ్యాంకింగ్) నితిన్ చుగ్ తెలిపారు. వినియోగదారు సేవల కోసం రోబోను వినియోగిస్తున్న తొలి బ్యాంకు తమదేనని ఆయన చెప్పా రు. రోబోటిక్స్, ఆర్టిఫిషల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీల ద్వారా ఈ రోబోను రూపొందించినట్టు చెప్పారు. రెండేళ్ల కాలంలో వివిధ శాఖల్లో 15 నుంచి 20 మనిషి రూపంలో ఉన్న హ్యూమనాయిడ్స్ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్లో దీన్ని నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications