ఆ సమయంలోనకిలీ నోట్లు రాలేదట: ఆర్బీఐ చెప్పింది
నోట్ల రద్దు అనంతరం, అంటే నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత రూ.1000, రూ.500 నోట్లలో నకిలీ కరెన్సీని గుర్తించారా? అయితే ఎంత మొత్తం? అనే ప్రశ్నలకు ఆర్బీఐ విస్తుగొలిపే సమాధానాలిచ్చింది.
పెద్ద నోట్ల మార్పిడి పరిణామాలతో అప్రతిష్టపాలైన రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా మరో ఆసక్తికరమైన వార్తను బయటపెట్టింది. నోట్ల రద్దు అనంతరం, అంటే నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత రూ.1000, రూ.500 నోట్లలో నకిలీ కరెన్సీని గుర్తించారా? అయితే ఎంత మొత్తం? అనే ప్రశ్నలకు ఆర్బీఐ విస్తుగొలిపే సమాధానాలిచ్చింది.
ముంబయికి చెందిన అనిల్ గల్గాని అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగి ప్రశ్నలకు మంగళవారం బదులిచ్చిన ఆర్బీఐ.. బ్యాంకుల్లో డిపాజిట్ అయిన నకిలీ నోట్ల వివరాలు, వాటికి సంబంధించిన సమాచారమేదీ తన వద్ద లేదని పేర్కొంది. పాతనోట్లు డిపాజిట్ చేసే క్రమంలో భారీగా నకిలీ కరెన్సీ బ్యాంకులకు చేరిందనే అనుమానాల నేపథ్యంలో అనిల్ ఆర్బీఐ నుంచి సమాచారాన్ని కోరాడు. ఇంతకుముందు నోట్ల మార్పిడి పక్ర్రియకు ముందు జరిగిన సంప్రదింపుల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.