వరుసగా రెండో రోజూ మార్కెట్లకు లాభాల కళ
వరుసగా రెండో రోజు మార్కెట్లో లాభాలు ఉరకలెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 241 పాయింట్లు లాభపడి 27,140 వద్ద నిలవగా, నిఫ్టీ 92 పాయింట్లు పుంజుకొని 8,381 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా, లోహ
వరుసగా రెండో రోజు మార్కెట్లో లాభాలు ఉరకలెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 241 పాయింట్లు లాభపడి 27,140 వద్ద నిలవగా, నిఫ్టీ 92 పాయింట్లు పుంజుకొని 8,381 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా, లోహ, బ్యాంకింగ్ రంగాలు మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చాయి. నెల రోజుల ముందుగానే సార్వత్రిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో అంచనాలు కూడా పెరిగాయని, దీంతో పెట్టబడిదార్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, చివర్లో నిఫ్టీ 100 పాయింట్లకుపైగా పురోగమించడం చెప్పుకోదగ్గ అంశం.

బీఎస్ఈలో ఐటీ తప్ప అన్ని రంగాలు లాభాల బాట పట్టాయి. లోహ రంగ సూచీ అత్యధికంగా 4.42%, బ్యాంకింగ్ 2.4%, పీఎస్యూ 1.72%, మూలధన వస్తు రంగం(1.39%) బాగా లాభపడగా; ఐటీ రంగ సూచీ 0.02% నష్టపోయింది.
సెన్సెక్స్లో లాభపడిన వాటిలో కోల్ ఇండియా(5.41%), టాటా స్టీల్(3.99%), లుపిన్(2.2%), ఎల్ అండ్ టీ(1.91%), ఐసీఐసీఐ బ్యాంకు(1.79%) ముందుండగా; బజాజ్ ఆటో(0.85%), ఐటీసీ(0.56%), రిలయన్స్(0.28%), ఓఎన్జీసీ(0.18%), ఇన్ఫోసిస్(0.16%) బాగా నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ యథాతథంగా నిలవగా, మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్ 4.3 శాతం పెరిగింది. మొత్తం స్టీల్ సామర్థ్యంలో 9 శాతానికి సమానమైన మధ్యస్థాయి ఫర్నేస్లను దేశవ్యాప్తంగా మూసివేసేందుకు చైనా నిర్ణయించడంతో లోహ రంగానికి లాభించింది. దీనికి 2.3 శాతం జంప్చేసిన బ్యాంక్ నిఫ్టీ జత కలవడంతో మార్కెట్లు లాభాలతో పురోగమించాయి. కాగా, ఇటీవల లాభాలతో పరుగులు తీస్తున్న షుగర్ షేర్లు నేటి ట్రేడింగ్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనడం గమనించదగ్గ పరిణామం.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications