పెట్టుబడిదారులకు త్వరలో వజ్రాలు మంచి ఎంపిక కావొచ్చు
ప్రపంచంలోనే కమొడిటీ ఎక్స్చేంజీలో వజ్రాలను ట్రేడ్ చేసే దేశంగా భారత్ ఎదగబోతోంది. దీని ద్వారా వ్యక్తులు తమ దగ్గర ఉన్న విలువైన రాళ్లను పారదర్శకతతో ఇండియన్ కమొడిటీ ఎక్స్చేంజీ ద్వారా అమ్మ
ప్రపంచంలోనే కమొడిటీ ఎక్స్చేంజీలో వజ్రాలను ట్రేడ్ చేసే దేశంగా భారత్ ఎదగబోతోంది. దీని ద్వారా వ్యక్తులు తమ దగ్గర ఉన్న విలువైన రాళ్లను పారదర్శకతతో ఇండియన్ కమొడిటీ ఎక్స్చేంజీ ద్వారా అమ్మేందుకు, కొనేందుకు వీలు కలుగుతుంది. ఇందుకోసం సెబీ నుంచి త్వరలో అనుమతులు పొందే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న సీనియర్ అధికారులు తెలిపారు. అనుమతులు రాగానే ఎక్స్చేంజీ ద్వారా వజ్రాల మార్పిడి మార్చి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దానికి సంబంధించి ప్రాథమిక అనుమతులు సెబీ నుంచి లభించినట్లు అనధికార వర్గాల సమచారం. రిలయన్స్ క్యాపిటల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ ప్రమోటర్లుగా కలిగిన ఎమ్ఎమ్టీసీ ఇందుకోసం 50 మందితో మాక్ ట్రేడింగ్ జరిపినట్లు తెలుస్తోంది. దీని కోసం అంతర్జాతీయ డైమండ్ గ్రేడింగ్ పరిశోధన సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొంది.