ఎయిర్టెల్ 4జీ డేటా ఆఫర్, కంపెనీ షేర్ల దిగాలు
ఎయిర్టెల్ బంపర్ ఆఫర్తో ముందుకు వచ్చింది. 2017 డిసెంబర్ వరకు నెలా నెలా 4జీ నెట్వర్క్ ద్వారా కాల్స్, 3జీబీ డేటా ఉచితమని మంగళవారం ప్రకటించింది. అయితే ఎంపిక చేసిన ప్రీ, పోస్ట్ పెయిడ్ ప్యాకేజీలపై మాత్ర
రిలయన్స్ జియో దెబ్బతో డేటా యుద్దం మొదలైంది. ఇప్పటివరకూ అధిక డేటా చార్జీలు వసూలు చేస్తున్న దిగ్గజ టెలికామ్ కంపెనీలు దిగి వస్తున్నాయి. జియో 4జీ వెల్కమ్ ఆఫర్ను కొత్త ఏడాది కానుకగా మార్చి 31 వరకు రిలయన్స్ పొడిగించింది. అయితే దీనికి పోటీగా ఎయిర్టెల్ బంపర్ ఆఫర్తో ముందుకు వచ్చింది. 2017 డిసెంబర్ వరకు నెలా నెలా 4జీ నెట్వర్క్ ద్వారా కాల్స్, 3జీబీ డేటా ఉచితమని మంగళవారం ప్రకటించింది. అయితే ఎంపిక చేసిన ప్రీ, పోస్ట్ పెయిడ్ ప్యాకేజీలపై మాత్రమే ఇది వర్తిస్తుందని భారతీ ఎయిర్టెల్ స్పష్టం చేసింది. ఎయిర్టెల్ 4జీ ఆఫర్కు సంబంధించిన మరిన్ని అంశాలు తెలుసుకోండి.

4జీ నెట్వర్క్కు మారాలి
4జీ మొబైల్ కలిగినవారు ఎయిర్టెల్ 4జీ నెట్ వర్క్కు మారాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ 3జీ వినియోగదారులు 4జీకి అప్గ్రేడ్ కావాలి. ప్రీ పెయిడ్ వినియోగదారులు రూ.345 ప్యాకేజీతో దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవడంతోపాటు 4జీ డేటాను 1జీబీ వరకు ఉచితంగా పొందవచ్చని తెలిపింది. 4జీకి మారిన వారు ఇన్ఫినిటీ ప్యాకేజీలతో అపరిమిత కాల్స్తో పాటు నెలకు 3జీబీ డేటాను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది.

ప్రతి నెలా 3జీబీ ఉచిత డేటా
జనవరి4 నుంచి మొదలయ్యే ఈ ఆఫర్ ఫిబ్రవరి 28తో ముగుస్తుందని ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఈ ఏడాది డిసెంబరు వరకూ వినియోగదారులు ప్రతి నెలా 3జీబీ ఉచిత డేటాను ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్యాక్ల ద్వారా పొందవచ్చు. ప్రధానంగా జియో ఇస్తున్న ఉచిత ఆఫర్లకు కౌంటర్గానే ఎయిర్టెల్ ఈ కొత్త ఆఫర్ ప్రకటించిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

బీఎస్ఎన్ఎల్ ఉచితం కాలింగ్
ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ కూడా ఉచిత కాలింగ్ అంటూ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశంలో అతి పెద్ద టెలికాం కంపెనీ ఎయిర్టెల్ కూడా ఈ పోటీలోకి దిగడంతో.. మిగిలిన కంపెనీలు కూడా ఇలాంటి ఆఫర్లను ప్రకటించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో వోడాఫోన్ సైతం దిగిరాక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

ఎయిర్టెల్ షేర్లపై ఒత్తిడి
ఎయిర్టెల్ ప్రస్తుత ఆఫర్లతో కంపెనీ లాభాలు, మార్జిన్లు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో భారతీ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. రిలయన్స్ జియో వంటి ప్రత్యర్థి కంపెనీల నుంచి ఎదురవుతున్న "ఉచిత' పోటీ కారణంగా మొబైల్ కంపెనీల మార్జిన్లు క్షీణించనుండటమే ఈ కౌంటర్లో అమ్మకాలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం భారతీ ఎయిర్టెల్ షేరు దాదాపు 2 నుంచి 3 శాతం పతనమై రూ. 302 దిగువకు చేరింది.

ఒత్తిడి ఎదుర్కొంటున్నటెలికాం షేర్లు
వరుసగా రెండో రోజూ టెలికాం షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. బుధవారం ఎయిర్టెల్ షేర్లు 0.8శాతం; ప్రారంభ ట్రేడింగ్లో ఐడియా షేర్లు 1.5 శాతం క్షీణించాయి. ప్రస్తుతం ఎయిర్టెల్ నిఫ్టీలో కాస్త కోలుకుని దాదాపు 3% పైగా లాభాల్లో ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications