డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన చార్జీలను తగ్గించకపోతే ప్రజలు తిరిగి నగదు లావాదేవీలకే మొగ్గుచూపే అవకాశం ఉందని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఖర్చులకు సంబంధించి సున్నితంగా ఆల
డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన చార్జీలను తగ్గించకపోతే ప్రజలు తిరిగి నగదు లావాదేవీలకే మొగ్గుచూపే అవకాశం ఉందని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ శర్మ అభిప్రాయపడ్డారు. ఖర్చులకు సంబంధించి సున్నితంగా ఆలోచించే భారత్ లాంటి దేశాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ రుసుములు తక్కువగా ఉండాల్సి ఉందని ఆయన అన్నారని పీటీఐ కథన సారాంశం. ప్రస్తుతం మార్చి 31 వరకూ నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన చార్జీలను రద్దు చేస్తూ ప్రభుత్వం, వివిధ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. దాని తర్వాత చార్జీల మినహాయింపులను కొనసాగించాల్సి ఉందని రామ్ సేవక్ శర్మ అన్నారు. ఫిక్కీ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దీర్ఘకాలంలో చూస్తే డిజిటల్ లావాదేవీలపై ప్రభావం చూపేది దానికయ్యే ఖర్చేనని, దానికి సంబంధించి ఖర్చులు తక్కువగా ఉండేలా తాను సూచిస్తున్నానన్నారు. ఉదాహరణగా టెలికాం రంగం గురించి చెప్పుకొచ్చారు. మొబైల్ రీచార్జీలు రూ.10 నుంచి సైతం చేసుకోవచ్చని, అవి కూడా ఆన్లైన్లో చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. ఇదే తరహా ఫార్ములాను ఆర్థిక రంగం అనుసరించాల్సింది ఉందని సూచించారు. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకు ఖాతాకు డబ్బు పంపేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా లేదా సున్నాగా ఉండాల్సి ఉందని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. నగదు ఎక్కువగా వ్యవస్థలో చలామణీలో ఉండటం ఇబ్బందికరమని, అలా ఉంటే బ్యాంకులకు ఎక్కువ లాభాలు వస్తాయని ఆయన అన్నారు. బ్యాంకులు ఈ మార్గంలో వచ్చే డబ్బును ఆదాయంగా చూడకూడదని శర్మ సలహా ఇచ్చారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications