డిజిట‌ల్ చెల్లింపుల‌కు ప్ర‌భుత్వం న‌జ‌రానాలు: ల‌క్కీ విజేత‌కు రూ. కోటి

డిజిటల్ చెల్లింపులను ప్రోత్స‌హించేందుకు నీతి ఆయోగ్ రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతోంది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజన అని

డిజిటల్ చెల్లింపులను ప్రోత్స‌హించేందుకు నీతి ఆయోగ్ రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతోంది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజన అని పిలిచే ఈ పథకాలను డిసెంబర్ 25 నుంచి అమలు చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వరకూ కొనసాగిస్తామని చెప్పారు. ఆ పథకాలలో లక్కీ గ్రాహక్ యోజన పథకం వినియోగదారుల కోసం, డిజిధన్ వ్యాపారి యోజన పథకం వ్యాపారుల కోసం రూపొందించారు.

 డిజిట‌ల్ చెల్లింపుల‌కు ప్ర‌భుత్వం న‌జ‌రానాలు: ల‌క్కీ విజేత‌కు రూ. కోటి

లక్కీ గ్రాహక్ యోజన పథకం కింద డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారుల్లో 15 వేల మందిని విజేతలుగా ఎంపిక చేస్తారు. వారికి రూ.1000 బహుమతిగా అందిస్తారు. అలాగే మొద‌టి విజేత‌కు రూ.కోటి, రెండో విజేత‌కు రూ. 50 ల‌క్ష‌లు, మూడో విజేత‌కు రూ.25 లక్ష‌ల చొప్పున న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తారు. పథకం అమలు పూర్తయ్యే చివరి రోజు అంటే 2017, ఏప్రిల్ 14న మెగా బహుమతి విజేత పేరు ప్రకటిస్తారు. ఈ పథకం రూ.50 నుంచి రూ.3000 వరకు చేసే డిజిటల్ చెల్లింపులకు కూడా వర్తిస్తుంది.
అలాగే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే వ్యాపారులలో వారానికి 7000 మందిని ఎంపిక చేస్తారు. వారికి గరిష్ఠంగా రూ.50,000 వరకు ప్రోత్సాహకం అందిస్తారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+