లాభాల్లో ముగిసిన మార్కెట్లు, వాహన,బ్యాంకింగ్,ఫార్మా రంగాలకు లాభాలు
యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లపై సమీక్ష జరపనుండటంతో గ్లోబల్ మార్కెట్లో కొనుగోళ్లు కనిపించాయి. మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 182 పాయింట్లు లాభపడి 26,698 వద్ద ముగియగా, నిఫ్టీ
యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లపై సమీక్ష జరపనుండటంతో గ్లోబల్ మార్కెట్లో కొనుగోళ్లు కనిపించాయి. మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 182 పాయింట్లు లాభపడి 26,698 వద్ద ముగియగా, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 8,222 వద్ద స్థిరపడింది.

ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫార్మా రంగం షేర్లలో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి కనబరిచారు. టాటా మోటార్స్, మారుతి సుజికి, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ , ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, సిప్లా, డా. రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, అలాగే ఇన్ఫోసిస్, విప్రో, రిలయన్స్, లార్సెన్ అండ్ టర్బో తదితర షేర్లు లాభపడ్డాయి. నష్టపోయిన వాటిలో గెయిల్, టాటా స్టీల్, లుపిన్, హెచ్యూఎల్, ఎన్టీపీసీ నష్టాల బాట పట్టాయి.


Click it and Unblock the Notifications