ఇంటర్నెట్ రహిత నగదు బదిలీ కోసం1800 1800 1234 అనే టోల్ ఫ్రీ నంబర్ ని తీసుకొచ్చింది సంస్థ. PayTM అకౌంట్ ఉన్నవారు ఈ నంబర్ కి డయల్ చేసి, ఒక 4 డిజిట్ సీక్రెట్ కోడ్ ని పొందవలసి ఉంటుంది.
పెద్ద నోట్ల రద్దుతో నగదుకు విపరీతమైన కొరత ఏర్పడింది. నగదు లేక ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఇప్పుడు వ్యాలెట్లు, మొబైల్ యాప్లే ప్రత్యామ్నాయాలుగా ఉంటున్నాయి. ఈ కోవలో మొదటి వరుసలో పేటీఎమ్ ఉంది. PayTM అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా వివరించే అవసరం లేనంత పాప్యులర్ అయిపోయింది. గత నెల రోజుల నుంచి ఈ మొబైల్ వ్యాలెట్లను వాడే జనాభా చాలా రెట్లు పెరిగింది. రీచార్జీలు, సినిమా టికెట్ల నుంచి, విమాన టికెట్ల దాకా, అన్ని ఖర్చులు PayTM ద్వారానే చెల్లిస్తున్నారు పట్టణ జనాభా. చేతిలో డబ్బు లేనప్పుడు ఈ PayTM బాగా ఉపయోగపడుతుంది. అందుకే రోజుకి వందల కోట్ల ట్రాన్ సాక్షన్స్ ఈ యాప్ ద్వారా జరుగుతున్నాయి.
PayTM ద్వారా ఇతరులకి చెల్లించాలంటే, వారికి PayTM ఖాతా ఉండాల్సిందే. అంతేకాక, వారి మొబైల్ నంబర్ మనదగ్గర ఉండాలి, లేక QR Code ని స్కాన్ చేసి పేమెంట్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మన ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అయితే అందరి దగ్గర అన్ని సమయాల్లో ఇంటర్నెట్ ఉండకపోవచ్చు. అయినా ఇప్పుడు అదేమీ పెద్ద సమస్య కాదు. ఇంటర్నెట్ లేకుండా కూడా PayTM ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
ఇంటర్నెట్ రహిత నగదు బదిలీ కోసం 1800 1800 1234 అనే టోల్ ఫ్రీ నంబర్ ని తీసుకొచ్చింది ఆ సంస్థ. PayTM అకౌంట్ ఉన్నవారు ఈ నంబర్ కి డయల్ చేసి, ఒక 4 డిజిట్ సీక్రెట్ కోడ్ ని పొందవలసి ఉంటుంది. ఒక్కసారి సీక్రెట్ కోడ్ పెట్టుకున్నాక, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా సరే, ఈ నంబర్ కి కాల్ చేసి, ఏ PayTM అకౌంట్ కి అయితే డబ్బులు పంపాలో, వారి PayTM అకౌంట్ ఉన్న మొబైల్ నంబర్ టైప్ చేసి డబ్బు పంపవచ్చు. అయితే మీ PayTM అకౌంట్లోకి డబ్బులు జమచేసుకోవడం మాత్రం ఇంటర్నెట్ మరియు యాప్ సహాయంతోనే చేసుకోవాలి.

ఐఐటీ పరీక్ష ఫీజు చెల్లింపుకూ పేటీఎమ్, ఎస్బీఐ బడ్డీ
పెద్ద నోట్ల రద్దుతో విద్యార్థులు, వ్యవసాయ దారులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ సంస్థలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు సీబీఎస్ఈ చేరింది. ఐఐటీ జేఈఈ పరీక్ష ఫీజును చెల్లించేందుకు పేటీఎమ్ను వాడుకునే వెసులుబాటును ఇచ్చింది. విద్యార్థులు దరఖాస్తు రుసుమును క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈ-చలానాతో పాటుగా ఈ-వాలెట్, పేటీఎమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన బడ్డీ వంటి వాటిని వాడుకునేందుకు సీబీఎస్ఈ నిర్ణయించింది. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలను పెంచే క్రమంలో భాగంగా ఈ ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఫీజు చెల్లించేందుకు పేటీఎమ్ వాడితే అదనంగా 1.5%; ఎస్బీఐ బడ్డీ ద్వారా అయితే రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications
