గత నెలలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ ట్రేడింగ్ స్టాక్ ఎక్స్చేంజీల్లో బుధవారం(అక్టోబర్ 19) నుంచి మొదలవుతుందని ఆర్బీఐ సోమవారం ప్రకటించింది.
గత నెలలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ ట్రేడింగ్ స్టాక్ ఎక్స్చేంజీల్లో బుధవారం(అక్టోబర్ 19) నుంచి మొదలవుతుందని ఆర్బీఐ సోమవారం ప్రకటించింది.
ప్రభుత్వం ఆగస్టు 29న సావరిన్ గోల్డ్ బాండ్ 2016-17-సిరీస్ 2 బాండ్లను విడుదల చేసింది. సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 9 మధ్య పెట్టుబడిదారులు వీటిని కొనుగోలు చేశారు. ఈ ఐదో దశలో 2 లక్షల మేర దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది మరిన్ని దశల్లో ఈ గోల్డ్ బాండ్లను జారీ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బాండ్లను గురించి ప్రచారం చేయడంలో ప్రభుత్వం బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలను సమర్థంగా వినియోగించుకుంది.