ఫ్రెంచ్ యుద్ధ విమానాలకు రూ. 58 వేల కోట్లు
ఫ్రాన్స్ రక్షణ రంగ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ నుంచి రూ. 58 వేల కోట్ల విలువైన 36 రఫెల్ యుద్ధ విమానాలను కొనేందుకు భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి జియాన్ యూ లీ డ్రెయిన్ ఒప్పందంపై సంతకాలు చేయడంతో డీల్ పూర్తయింది. డీల్కు సంబంధించిన మరిన్ని వివరాలు కింద చదవండి

1. భారత్ ఇందుకోసం రూ. 58 వేల కోట్లను చెల్లించనుంది. 15 శాతాన్ని ముందస్తుగా చెల్లించనున్నారు.
2. ప్రపంచంలో అడ్వాన్స్డ్ ఆయుధాలైన యుద్ద పరికరాలు, మీటియర్ క్షిపణులను భారత్ పొందనుంది. 36 విమానాలకు చెందిన విడిభాగాలు, నిర్వహణ సామాగ్రిని అందజేస్తారు.
3. దక్షిణాసియాలో ఇది ఒక కీలక మార్పుగా పరిణమిస్తుంది. మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్లకు ఈ తరహా మిలిటరీ ఆయుధ వ్యవస్థ లేదు.
4. తుది ఒప్పందం తర్వాత మొదటి దశ రఫెల్ యుద్ద విమానాలు భారత్కు 18 నెలల్లోపు అందుతాయి.
5. దేశ మిలిటరీ యుద్ద విమానాల పరిశోధన కార్యక్రమాలకు సంబంధించి 30 శాతం ఖర్చు పెట్టననున్న ఫ్రాన్స్ స్థానికంగా రఫెల్ విమానాల విడిభాగాలను తయారుచేసేందుకు 20 శాతాన్ని ఖర్చు చేయనుంది.


Click it and Unblock the Notifications