భారత బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ సీఎండీ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ ఈ ముగ్గురు బ్యాంకర్లు ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫార్చ్యూన్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో చోటుదక్కించుకున్నారు. అమెరికా వెలుపలి దేశాలను ఆధారంగా చేసుకుని 50 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ రూపొందించింది. ఆ జాబితాలో భట్టాచార్య రెండో స్థానం, చందాకొచ్చర్ ఐదో స్థానం, శిఖా శర్మ పందొమ్మిదో స్థానంలో ఉన్నారు.

1- అన బోటిన్
2- అరుంధతీ భట్టాచార్య
5- చందాకొచ్చర్
19- శిఖాశర్మ
మూడేళ్లుగా ఎస్బీఐకు నేతృత్వం వహిస్తున్న అరుంధతీ భట్టాచార్య తన పనితీరు ఆధారంగా 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. దేశీయ ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకుకు సీఈవోగా వ్యవహరించడంతో పాటు ఎండీగా ఉన్న చందాకొచ్చర్ బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సాంకేతిక మార్పులకు ఆహ్వానం పలికారు. దీంతో ఆమె 5వ స్థానంలో నిలిచారు. ప్రయివేటు రంగ బ్యాంకింగ్లో ముందు వరుసలో నిలిచిన యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ 19 వ స్థానంలో ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications