For Quick Alerts
For Daily Alerts
వెస్ట్ బెంగాల్లో ఇన్ఫోసిస్ సెజ్కు నో అన్న కేంద్రం
|
రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేవన్న కారణంతో పశ్చిమబెంగాల్లో ఇన్ఫోసిస్ తలపెట్టిన ఐటీ సెజ్ను కేంద్రం తిరస్కరించింది. సెజ్ల బోర్డ్ ఆఫ్ అప్రూవల్ సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రెకమెండేషన్ లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. ఎక్కడ సెజ్ నిర్మించతలపెట్టారో ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించడం కష్టమనే భావనతో ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రభుత్వ అధికారి వెల్లడించారు.
సౌత్24 పరగణాల్లో 20.14 హెక్టార్లలో ఇన్ఫోసిస్ ఒక ఐటీ/ ఐటీఈఎస్ సెజ్కు ప్రతిపాదించింది. ఫల్తా సెజ్ అభివృద్ది కమిషనర్ దీనికి సూత్రప్రాయ అనుమతినిచ్చారు.
Comments
English summary