జీఎస్‌టీ మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మంటే?

దేశ‌వ్యాప్తంగా వ‌స్తు, సేవ‌ల‌కు ఒకే ప‌న్ను విధించ‌డంతో పాటు ప‌న్నుపై ప‌న్ను వేసే ప‌ద్ద‌తిని మార్చే ఉద్దేశంతో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ‌స్తు, సేవ‌ల ప‌న్ను బిల్లు గ‌తేడాదే లోక్ స‌భ‌లో ఆమోదం పొందింది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదానికి లోక్‌సభ‌, రాజ్య‌స‌భ‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవ‌స‌రం. ఇంకా స‌గానికి పైగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.

 మొద‌టి కార‌ణం:

మొద‌టి కార‌ణం:

రాష్ట్ర ప్ర‌భుత్వాల రెవెన్యూ పెరిగేందుకు జీఎస్‌టీ దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌దు. పేద రాష్ట్రాలైన ఉత్త‌ర ప్ర‌దేశ్‌, బీహార్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదాయ వ‌న‌రులు పెరిగేందుకు అవ‌కాశం ఉంది.

రెండో కార‌ణం:

రెండో కార‌ణం:

మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశ‌మంతా ఏక‌రీతి మార్కెట్ నిర్మించ‌గ‌ల స‌త్తా భార‌త్‌కు ల‌భిస్తుంది. ప్ర‌స్తుతం దేశ‌మంతా 30 లేదా అంత‌క‌న్నా ఎక్కువ మార్కెట్లుగా విడిపోయింది. ఎన్నో ర‌కాల ప‌న్నుల వ్య‌వ‌స్థ ప్ర‌స్తుతం ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు కేంద్ర అమ్మ‌క‌పు ప‌న్ను, ఎక్సైజ్ ప‌న్ను, సేవా ప‌న్ను, విలువ ఆదారిత ప‌న్ను వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవ‌న్నీ లేకుండా ఒకే ర‌క‌మైన ప‌న్ను ఉంటే దేశీయ ఉత్ప‌త్తి పెరుగుతుంది.

 మూడో కార‌ణం:

మూడో కార‌ణం:

విలువ ఆధారిత ప‌న్ను అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌న్ను వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు జ‌రిగాయి. అప్ప‌ట్లో సైతం రెండు, మూడు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంగీక‌రించ‌లేదు. త‌ర్వాత దాని ద్వారా వ‌చ్చిన ప్ర‌యోజ‌నాల‌ను గ‌మ‌నించిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వాల‌న్నీ దానికి మొగ్గుచూపాయి. ప్ర‌స్తుతం సైతం ప‌న్ను వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పుల‌కు జీఎస్‌టీ దారి తీస్తుంది.

మ‌రో విష‌య‌మేమిటంటే జీఎస్‌టీ అమ‌లును కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ర్య‌వేక్షించే అవ‌కాశం ఉన్నందున ప‌న్ను ఎగ‌వేసేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌.

 నాలుగో కార‌ణం:

నాలుగో కార‌ణం:

రాష్ట్రాల స్థాయిల్లో విలువ ఆధారిత ప‌న్ను విధానంలో వ‌స్తువుల‌పై విధించే ప‌రోక్ష ప‌న్నులైన విలాస‌, వినోద ప‌న్నుల్ని ప్ర‌త్యేకంగా వ‌సూలు చేస్తున్నారు. ఈ ప‌న్నుల బెడ‌ద నుంచి వినియోగ‌దారుల‌కు స్వాంత‌న ల‌భిస్తుంది. జీఎస్‌టీని రాష్ట్ర స్థాయిలో ప్ర‌వేశ‌పెట్టిన‌ట్ల‌యితే అన్ని సేవ‌ల‌పై ప‌న్ను విధించే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఇవ్వాల్సి వ‌స్తుంది. రాష్ట్రాల‌కు అలాంటి అధికారం ఇవ్వాలంటే రాజ్యాంగ స‌వ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి. కాని ప్ర‌స్తుతం ఉన్న బిల్లు రూపంలో కేంద్రానికే ప‌న్ను వ‌సూలు అధికారాలు ఎక్కువ ఉండేలా ఉన్నాయి. ఎప్పుడైనా కేంద్ర‌మే ప‌న్ను వ‌సూలు చేసి రాష్ట్రాల‌కు పంచుతుంది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఎక్కువ‌గా ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంది.

ఐదో కార‌ణం:

ఐదో కార‌ణం:

నిపుణుల అంచ‌నా ప్ర‌కారం జీఎస్‌టీని అమ‌లు ప‌రిస్తే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు 15 బిలియ‌న్ డాల‌ర్ల మేర ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే జీఎస్‌టీ మేకిన్ ఇండియాను ప్రోత్స‌హించ‌డం ద్వారా దేశ ఎగుమతులు పెర‌గ‌డంతో పాటు ఉద్యోగ అవ‌కాశాల్లో గ‌ణ‌నీయ‌మైన వృద్ది ఉండ‌గ‌ల‌దు. ప్ర‌స్తుతం త‌యారీ, సేవా రంగాలు ప‌న్ను రీత్యా వేరువేరుగా ఉన్నాయి. అవ‌న్నీ ఒకే గొడుగు కింద‌కు రాగ‌ల‌వు.

ప్ర‌స్తుత పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లును ఆమోదించ‌డం ద్వారా వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ స‌మ‌యానికి చ‌ట్టం అమ‌లుప‌రిచేలా చేసేందుకు ఎన్డీఏ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+