For Quick Alerts
For Daily Alerts
47 శాతం మంది భారతీయులు రిటైర్మెంట్కు పొదుపు చేయడం లేదు: సర్వే
|
ఉద్యోగం మానేసిన తర్వాత ఆర్థిక భద్రత ఎంతో ముఖ్యమైనదప్పటికీ ఎంతో మంది భారతీయులు ఆ దిశగా ఆలోచించడం లేదు. ఉద్యోగాలు చేస్తున్న వారిలో భవిష్యత్తు కోసం పొదుపు చేయకుండా ఉండే వారి సంఖ్య 47 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడి అయింది. వీరంతా మధ్యలో పొదుపును ఆపేయడం లేదా అసలు పొదుపు గురించే ఆలోచించకుండా ఉన్నట్లు తెలుస్తోంది.
"ఉద్యోగాలు చేస్తున్న వారిలో 47 శాతం మంది పొదుపును ప్రారంభించకుండా లేదా సరైనంత పొదుపు చేయకుండా ఉన్నారు. వీరంతా ఏదో ఒక దశలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా పొదుపు చేయని వారి ప్రపంచ సగటు 46 ఉండగా భారత్లో అది అంతకంటే ఎక్కువగా ఉంది." అని హెచ్ఎస్బీసీ పేర్కొంది.
మీరు ఈ 47 శాతం మందిలో ఉన్నారా? అయితే ఇప్పటినుంచే పొదుపు చేయడం ప్రారంభించండి.
Comments
English summary