మూలాలు బలంగా ఉన్న ఎఫ్ఎమ్సీజీలకు పతంజలి సవాలు కాకపోవచ్చు: క్రెడిట్ సూయిజ్
యోగా గురు బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద్ వినియోగదారు ఉత్పత్తి రంగంలో ఇటీవల వేగంగా ఎదగడాన్ని చూస్తున్నాం. అయితే మూలాలు బలంగా ఉన్న ఎఫ్ఎమ్సీజీ సంస్థలకు ఇది పెద్ద సవాలు కాకపోవచ్చని క్రెడిట్ సూయిజ్ రిపోర్టు పేర్కొంది. అన్బ్రాండెడ్ విభాగాల నుంచే వినియోగదారులు కొత్తగా మారుతున్నందున ఈ విధమైన పరిస్థితి ఉండొచ్చని తెలిపింది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల్లో చెప్పుకోదగ్గ విధంగా ఉంది.
"మా విశ్లేషణ ప్రకారం కంపెనీ స్థాయిల్లో చూస్తే కోల్గేట్కు సవాలుగా ఉంది. వినియోగదారుల వైఖరి బ్రాండెడ్ ఆహారానికి మారడం మూలంగా పతంజలి వృద్దికి ఒక కారణంగా ఉంటోంది." అని స్విట్జర్లాండ్ ఆర్థిక సంస్థ వెల్లడించింది. ఇందుకోసం ఆ సంస్థ పతంజలికి చెందిన దిల్లీ, ఎన్సీఆర్, ముంబయి, ఉత్తరప్రదేశ్ల్లో 100 ఫ్రాంచైజీలను సర్వే చేసింది.
జనవరి 2016 నాటికి 10 నెలల కాలంలో పతంజలి గ్రూప్ రూ. 3267 కోట్ల అమ్మకాలను పూర్తిచేసింది. గత ఏడాది అమ్మకాలు రూ. 1587 కోట్లతో పోలిస్తే 106 శాతం వృద్దిని సాధించింది.