ముంబై: రెపో రేటు, రివర్స్ రెపో రేటుని యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం వెల్లడించారు. రెపో రేటు 6.75 శాతం, రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉంచుతున్నామని, ఎటువంటి మార్పులు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతమని నిర్ణయించమన్నారు. కాగా, మార్చి 2017 నాటికి ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్త సంస్కరణలకు ప్రస్తుత బడ్జెట్లో పెద్దపీట వేయడం, వ్యయాలను నియంత్రించడం ద్వారా వృద్ధిని సాధించవచ్చని రాజన్ తెలిపారు.
ద్రవ్య పరపతి విధాన సమీక్ష ముఖ్యాంశాలు:
* 6. 7శాతం వద్ద రెపో రేటు యథాతథం
* నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంలో ఎటువంటి మార్పులేదు.
* బ్యాంకు రేటు 7.75శాతంగా నిర్ణయించింది.
* ప్రస్తుత బడ్జెట్లో సంస్కరణలు వల్ల రేట్ల తగ్గించే అవకాశం
* మార్చి 2017 నాటికి ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా
* దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండే అవకాశం.