స్సైస్జెట్ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టికెట్ల ధరలపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. 'హ్యాపీ న్యూ ఇయర్' సేల్ పేరుతో స్పైస్ జెట్ ప్రకటించిన ఈ ఆఫర్ కింద కనీస ధర రూ.716కే దేశీయ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
స్సైస్జెట్ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్
వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 12వ తేదీలోపు ప్రయాణాలు చెయ్యాలనుకునే వారు ఈ నెల 31లోపు టికెట్లను బుక్ చేసుకోవచ్చని ప్రయాణికులకు తెలిపింది. నేరుగా వెళ్లే విమానాలకు మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయని పేర్కొంది. సీట్ల సంఖ్య తక్కువగా ఉన్నందున ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత లభిస్తుందని స్పైజ్ జెట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
స్సైస్జెట్ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్
బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ రద్దు చేసుకునే సదుపాయం కూడా ఉందని, రిఫండ్ వర్తిస్తుందని అందులో పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మరికొన్ని కొత్త విమానాలను స్సైస్జెట్ కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని
స్సైస్జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ వెల్లడించారు.
స్సైస్జెట్ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో 10-15 ఏళ్ల పాటు కొత్త విమానాలను వినియోగించే అవకాశం ఉండటంతో, సరైన విమాన తయారీ సంస్థను ఎంచుకున్నాకే ఈ విషయంపై ముందుకు వెళ్తామన్నారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
స్సైస్జెట్ 'న్యూ ఇయర్' సేల్: రూ. 716కే టికెట్
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం స్సైస్జెట్ వద్ద 41 విమానాలుండగా, అదనంగా దాదాపు 150 విమానాలకు ఆర్డరు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విమానాల కొనుగోలు కోసం స్సైస్జెట్ భారీగా నిధులను సమీకరించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భాగస్వాముల వాటాను తగ్గించడం ఉత్తమమైన నిర్ణయం కాదని, ఇతర మార్గాలను అన్వేషిస్తామని సింగ్ చెప్పారు.