2 AC టికెట్ ధరకే విమాన ప్రయాణం: ఎయిర్ ఇండియా

ముంబై: సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఎకానమీ తరగతి టికెట్లను ముందుగా కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభించనున్నాయి.

ఈ ధరలు దాదాపు 2 ఏసీ తరగతి రైలు టికెట్‌ ధరలతో సమానంగా ఉండడం గమనార్హం. ఈ ఆఫర్‌లో భారత్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై, చెన్నై, కోల్‌కత్తాలు ఉండటం విశేషం. 90 రోజుల ముందుగా కొనుగోలు ధరలు (అన్నీ కలుపుకుని) రూ. 2865తో ప్రారంభం కావొచ్చని సమాచారం.

 Air India targets 2AC train passengers by matching fares, rolls out advance purchase scheme

ముందుగా కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ధరలకే టికెట్ లభించే ఈ ఆఫర్ ఇప్పటికే వివిధ మార్గాల్లో అందుబాటులోకి ఉందని అధికారులు తెలిపారు. ఈ సరికొత్త ఆఫర్ ప్రకారం ఢిల్లీ-ముంబై మార్గంలో టికెట్ ధర రూ. 2865, ఢిల్లీ-భువనేశ్వర్ మార్గంలో రూ. 3470గా ఉండొచ్చని అంచనా.

ఆయా మార్గాల్లో సెకండ్ ఏసీ టికెట్ ధరలు రూ. 2865, రూ. 3325గా ఉండటం గమనార్హం. కీలక దేశీయ మార్గాల్లో ఎకామనీ తరగతి ధరలను సెకండ్ ఏసీ రైలు ధరల స్థాయికి తీసుకొచ్చామని అంటున్నారు. సామాన్యులకూ అందుబాటులో విమాన టికెట్ ధరలు అందుబాటులో ఉండాలన్నదే దీని ఉద్దేశమని పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+