ముంబై: ప్రముఖ దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ 'మ్యూచువల్ ఫండ్ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్' పేరిట ఓ సరికొత్త ఓపెన్ ఎండెడ్ బ్యాలెన్స్డ్ స్కీమును ప్రవేశపెట్టింది. ఈ స్కీము ద్వారా రూ. 700 కోట్ల రూపాయలు సమీకరించాలని యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించుకుంది.
ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓ నవంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 2న ముగుస్తుందని యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ చంద్రేశ్ కుమార్ నిగమ్ పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల చదువు, పెళ్లిళ్లు చేసేందుకే ఎంతో కష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఫండ్లో యూనిట్ల కేటాయింపు అనంతరం దీన్ని నిరంతర పెట్టుబడులకు డిసెంబర్ 14లోగా తిరిగి తెరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధుల్లో 40 నుంచి 60 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి మిగతా మొత్తాన్ని డెట్, ఇతర ఉపకరణాల్లో పెడతామన్నారు.
మ్యూచువల్ ఫండ్ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్లో రెండు ప్లాన్లు ఉంటాయన్నారు. ఒకటి డైరెక్ట్ ప్లాన్ కాగా, రెండోది రెగ్యులర్ ప్లాన్ అన్నారు. వీటికి అనుబంధంగా రెండేసి సబ్ప్లాన్లు (కంపల్సరీ లాకిన్, నో లాకిన్) కూడా ఉంటాయన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications