విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఇందుకు కారణం విమాన టిక్కెట్లపై 2 శాతం సుంకం విధించాలని ప్రభుత్వం భావించడమే. త్వరలో ప్రభుత్వం వెలువరించే కొత్త పౌర విమానయాన విధానంలో ఈ మార్పు చోటు చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఈ సుంకం నిధులతో ఈశాన్య రాష్ట్రాల వంటి మారుమూల ప్రాంతాల్లోని విమానాశ్రయాలకు విమాన సర్వీసులను నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం దీనిపై చర్చలు తుది దశలో ఉన్నాయి. దేశంలో విమానయానానికి కొత్త రూపు ఇవ్వడంతో పాటు నష్టాలున్నా, ఈశాన్య రాష్ట్రాలకు సైతం రెగ్యులర్గా విమాన సర్వీసులు నడపాలని ప్రభుత్వం భావిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్పై 2 శాతం సుంకం
విమానయాన రంగం అభివృద్ధికి దీర్ఘకాల వ్యూహాన్ని ఈ విధానం అందిస్తుందని వివరించారు. రద్దీ సీజన్లు, సమయాల్లో విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ల ధరలు నిర్ణయించడాన్ని సైతం నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్పై 2 శాతం సుంకం
దీనిపై ప్రధాని మోడీ సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ ఈ విషయం చెప్పారు.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్పై 2 శాతం సుంకం
దీని వలన మొత్తం పరిశ్రమకే చెడ్డ పేరు వస్తోందని ప్రధాని చెప్పినట్టు తెలిపారు. ఇందుకోసం మూడు విధానాలు పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. విమానయాన సంస్థలను విశ్వాసంలోకి తీసుకుని, పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని చెప్పడం అందులో ఒకటి.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్పై 2 శాతం సుంకం
పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) ద్వారా టికెట్ల ధర నిర్ణయించడం రెండోది. అప్పటికీ కంపెనీలు దారికి రాకపోతే ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియా ఛార్జీల ఆధారంగా టికెట్ల ధరలు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశీయ విమాన సంస్థలు విదేశాలకు విమానాలు నడపడంపై ఉన్న నిబంధనలు మార్చే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

విమాన ప్రయాణం మరింత భారం: టికెట్పై 2 శాతం సుంకం
గురువారం పౌర విమానయానంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ కొత్త విధానంతో దేశంలో పర్యాటక పరిశ్రమ సైతం ఊపందుకుంటుందన్నారు. విమానాల ద్వారా సరుకులు, ప్రయాణికుల రవాణాకు ప్రాంతీయ స్థాయిలో మన దేశాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications