బంగారం మరింత ప్రియం: పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి
చైనా సంక్షోభం ప్రపంచంలోని మిగతా దేశాల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనాలో ఆర్ధిక వ్యవస్ధ బాగోకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, ఇతర కమోడిటీలు, లోహల ధరలు తగ్గుతున్నాయి.
తాజాగా రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్టానికి సోమవారం పడిపోయింది. కరెన్సీల విలువ సంక్షోభం భయపెడతోంది. స్టాక్ మార్కెట్ల పతనంతో సోమవారం బంగారం ధర మరింత పెరిగింది. చైనా ఆర్ధిక వ్యవస్ధ చక్కబడే వరకూ బంగారం తగ్గుముఖం పట్టే వీలు లేదని అంటున్నారు.
బంగారం మరింత ప్రియం: పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి
చైనా సంక్షోభం ప్రపంచంలోని మిగతా దేశాల ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనాలో ఆర్ధిక వ్యవస్ధ బాగోకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, ఇతర కమోడిటీలు, లోహల ధరలు తగ్గుతున్నాయి.
బంగారం మరింత ప్రియం: పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి
చైనా స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ముడి చమురు ధర ఆరున్నరేళ్ల కనిష్ట స్ధాయికి చేరింది. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లు వెంటనే పెరగపోవచ్చన్న అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.
బంగారం మరింత ప్రియం: పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి
చైనా తన కరెన్సీ విలువను మొత్తం మీద 10 శాతం వరకూ తగ్గించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. చైనా ఆర్ధిక వ్యవస్ధ అంచనా వేసిన దాని కంటే సమస్యలు ఎక్కువగా ఉండటంతో బంగారానికి మద్దతు లభిస్తుంది.
బంగారం మరింత ప్రియం: పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి
పెట్టుబడి ఉద్దేశంతో బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర రూ. 27,930 వరకు పోయింది. గత మూడు నెలల్లో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.