తిరుమల తిరుపతి దేవస్ధానానికి విరాళాలిచ్చే భక్తులకు కొత్త అవకాశాన్ని కల్పించింది. ఇకపై స్వామి వారికి షేర్లు, సెక్యూరిటీల రూపంలోనూ విరాళాలు సమర్పించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇందుకు సంబంధించి టీటీడీ కొత్తగా డీమ్యాట్ అకౌంట్ను ప్రారంభించింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఇప్పటివరకూ కానుకల రూపంలో భూములు, నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వంటికి హుండీలో వేస్తున్నారు. అప్పుడప్పుడూ షేర్లను సర్టిఫికెట్ల రూపంలో స్వామివారి పేరిట రాసి హుండీలో వేస్తున్నారు. అయితే, సర్టిఫికేట్ల రూపంలో వచ్చే ఆ షేర్లను మార్చుకోవడంలో టీటీడీ అధికారులకు ఇబ్బందిగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇలా రూ. కోటి 80 లక్షల విలువైన షేర్లు టీటీడీ వద్ద ఉన్నాయి. ఇలా స్వామివారికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో కానుకలు బదిలీ చేయాలనుకునే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ తిరుమల వెంకన్న పేరిట డీమ్యాట్ ఖాతాను తెరిచారు. ఈ నిర్ణయంతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ డీమ్యాట్ ఖాతాలోకి షేర్లు, సెక్యూరిటీ బాండ్ల బదిలీ, జమ చేసే వెసులుబాటు కలిగింది.

శ్రీవారిపై షేర్లు: డీమ్యాట్ ఖాతా ప్రారంభించిన టీటీడీ
సోమవారం టీటీడీ ఈవో సాంబశివరావు సెంట్రల్ డిపాజిటర్ సర్వీసెస్ (సీడీఎస్ఎస్) అధికారులకు డీమ్యాట్ ఖాతా పత్రాలను అందజేశారు. ఈ ఖాతా నెం. 1601010000384828 గా ఉంది. ఈ సందర్భంగా సంస్ధ ప్రతినిధులు టీటీడీ ఈవోతో సమావేశమై డీమ్యాట్ అకౌంట్ ప్రాముఖ్యతను వివరించారు.

శ్రీవారిపై షేర్లు: డీమ్యాట్ ఖాతా ప్రారంభించిన టీటీడీ
ఈ కార్యక్రమంలో సీడీఎస్ఎస్ చైర్మన్ ఎస్. రంగాచారి, ఎండీ పీఎస్ రెడ్డి, టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజి, హెచ్సీఐఎల్ సీఈవో రమేష్లు పాల్గొన్నారు. డీమ్యాట్ అకౌంట్ ప్రారంభం కావడంతో మంగళవారం నుంచి భక్తుల వద్ద నుంచి షేర్లు, సెక్యూరిటీస్ రూపంలో విరాళాల సేకరణ చేపడతారు.

శ్రీవారిపై షేర్లు: డీమ్యాట్ ఖాతా ప్రారంభించిన టీటీడీ
దేశవ్యాప్తంగా 28 వేల పోస్టాఫీసుల్లో శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది. పోస్టల్ శాఖకు ‘నేషనల్ బిల్లర్' పోర్టల్ అనుమతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై విధి విధానాలను మంగళవారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఈవో సాంబశివరావు, టీటీడీ, పోస్టల్ ఉన్నతాధికారుల సమావేశంలో ఖరారు చేశారు.

శ్రీవారిపై షేర్లు: డీమ్యాట్ ఖాతా ప్రారంభించిన టీటీడీ
ప్రస్తుతం పోస్టల్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 160 పోస్టాఫీసుల్లో రూ.300 దర్శన టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications