న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న ప్రతిసారీ తమ సంస్ధ నష్టపోయిందని ఇన్ఫోసిస్ సహా వ్వవస్ధాపకుడు ఎన్.ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు ప్రారంభమైన తర్వాత మార్పులు చేర్పులు జరగడం, చెల్లింపులు ఆలస్యం అవడం లాంటివి ఇబ్బందిగా మారాయని, అంతర్జాతీయ స్ధాయి నిబంధనలు అమలు కావడం లేదని అన్నారు.
ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఆయన డిజిటల్ ఇండియా విజయవంతం కావాలంటే, ఆ పరిస్ధితి మారాలని అన్నారు. 'ఇన్ఫోసిస్ గురించి నాకు తెలుసు. అది ఏ ఒక్క ప్రభుత్వ ప్రాజెక్టులో కూడా డబ్బు నష్ట పోకుండా పూర్తవలేదు' అని ఆయన అన్నారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఇన్ఫోసిస్ నష్టపోయింది: మూర్తి
సరైన సమయానికి సాంకేతికత లభ్యం కాకపోవడం, లంచగొండితనం భారత ఐటీ సంస్ధలను పట్టి పీడిస్తున్నాయని ఆయన తెలిపారు. వీటన్నింటిని పరిష్కరిస్తే, డిజిటల్ ఇండియాను విజయవంతం చేయడంలో మొత్తం ఐటీ పరిశ్రమ ప్రభుత్వం వెనుక నిలుస్తుందనడంలో సందేహం లేదని అన్నారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఇన్ఫోసిస్ నష్టపోయింది: మూర్తి
ఇన్ఫోసిస్తో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన హెల్త్ కేర్, ఈ గవర్నెన్స్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. ప్రభుత్వ విధానం మారితేనే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ప్రభుత్వంతో చేతులు కలిపేందుకు ముందుకు వస్తాయని అన్నారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఇన్ఫోసిస్ నష్టపోయింది: మూర్తి
కంపెనీలకు, ప్రభుత్వాలకు సానుకూలంగా ఉండేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. మా నిపుణులకు తగినంత సమయం ఇస్తే సమస్యను పరిష్కరిస్తారని అన్నారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఇన్ఫోసిస్ నష్టపోయింది: మూర్తి
డిజిటల్ ఇండియా ఊపందుకుంటే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడంలో డిజిటల్ ఇండియా కీలకం కానుందని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications