సన్ ఫార్మా సీఈవోతో సహా 18 మందికి షాక్
ముంబై: ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన కంపెనీలో అనుకోని విధంగా మార్పులు చేసింది. ఆ కంపెనీ సీఈవో తో సహ పలువురు సీనియర్లను కంపెనీ నుండి సున్నితంగా పక్కకు పంపించారు. అయితే పెద్దగానే డీల్ కుదరడంతో వారు తప్పుకున్నారని సమాచారం.
సీఈవోగా ఉన్న ఇంద్రజిత్ బెనర్జీ, యూగుల్ సిగ్రితో సహ ప్రసిడెంట్ స్థాయిలో ఉన్న 18 మంది ఉద్యోగులను రాజీనామా చెయ్యాలని కంపెనీ మనవి చేసింది. అందుకు వీరికి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చారని సమాచారం. అందుకే 18 మంది రాజీనామ చెయ్యడానికి అంగీకరించారని సమాచారం.
ఈ విషయంపై సన్ ఫార్మా కంపెనీ వివరణ ఇచ్చింది. వారిని కంపెనీలో కొనసాగించడానికి, వారి సేవలను ఉపయోగించుకొవడానికి చాలా ప్రయత్నించామని, అది వీలుకాలేదని, తాము అందులో విఫలం అయ్యామని ఈ విషయంలో ఎలాంటి సమస్యలు రాలేదని స్పష్టం చేసింది.
నష్టాలలో ఉన్న సన్ ఫార్మా తన కంపెనీని గట్టెక్కించడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని నిపుణలు అంటున్నారు. గతంలో జపాన్ కు చెందిన దైచీ శాంక్యో కంపెనీ నష్టాలను అనుభవించిన విషయం తెలిసిందే.
2014 ఏప్రిల్ లో దైచీ శాంక్యో కంపెనీని సన్ ఫార్మ కంపెనీ టేకోవర్ చేసుకునింది. రెండు పెద్ద కంపెనీలో కలిసి పని చేస్తున్న సమయంలో నష్టాలు రావడంతో సన్ ఫార్మా కంపెనీ పలు మార్పులు చేస్తున్నది. 2016లో కంపెనీకి మరన్ని కష్టాలు రాకుండ ఇప్పుడే జాగ్రతలు తీసుకుంటున్నదని వ్యాపార వర్గాలు అంటున్నాయి.