షేర్ విలువ రెట్టింపు: భారత సంతతి ట్రేడర్ అరెస్టు
అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో షేర్ల విలువ ఆకస్మాత్తుగా, భారీ ఎత్తున తగ్గిపోవడానికి కారణమయ్యాడనే ఆరోపణలతో భారత సంతతికి చెందిన ప్యూచర్స్ ట్రేడరైన నవీందర్ సింగ్ సారావో(36)ను బుధవారం అరెస్టు చేశారు. వాల్ స్ట్రీట్లో 2010 మే నెలలో జరిగిన ఓ సంఘటనకు గాను మార్కెట్ విలువ కొన్ని నిమిషాల వ్యవధిలో లక్ష కోట్ల డాలర్ల మేరక పతమయ్యాయి.
ఈ 'ప్లాష్ క్రాష్'లో పాత్ర ఉందన్న ఆరోపణలపై నవీందర్ సింగ్ సారావ్ (36)ను బ్రిటిష్ అధికారులు అరెస్టు చేశారు. అమెరికా న్యాయ విభాగం కోరినందునే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు స్కాట్లాండ్ పోలీసులు వెల్లడించారు. వెస్ట్ లండన్లోని హోన్స్లో నివాసం ఉంటున్న నవీందర్ సింగ్ సారావ్ ఆటోమెటెడ్ కంప్యూటర్ ప్రొగ్రాముల ద్వారా స్టాక్ మార్కెట్లలోని షేర్ ధరలను రెట్టింపు చేసినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.
దీంతో అతడిని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు ఎదుట హాజరు పరచగా తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తాను ఒప్పకోవడం లేదని డిస్ట్రిక్ట్ న్యాయమూర్తికి నవీందర్ తెలిపాడు. దీంతో పూర్తి స్ధాయి వాదనలను ఆగస్టులో వింటామని న్యాయమూర్తి అన్నారు.