భారత్ ఫోర్జ్ చేతికి ఫ్రెంచ్ కంపెనీ ఎంజిఎల్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ భారత్ ఫోర్జ్.. ఫ్రాన్స్కు చెందిన మెకానిక్ జనరల్ లాంగ్రోయిస్ (ఎంజీఎల్) అనే సంస్థను 1.18 కోట్ల యూరోలకు (రూ.90 కోట్లు) కొనుగోలు చేసింది. జర్మనీ అనుబంధ వ్యాపార సంస్థ సీడీపీ భారత్ ఫోర్జ్ జిఎంబిహెచ్ ద్వారా ఎంజీఎల్లో 100 శాతం వాటా తీసుకున్నట్లు స్టాక్మార్కెట్లకు భారత్ ఫోర్జ్ తెలిపింది.
ఈ డీల్తో సంస్థ టర్న్కీ సొల్యుషన్స్ సేవలు మరింత మెరుగుపడటంతోపాటు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్కు సంబంధించిన ఉత్పత్తుల విభాగంలో సామర్థ్యం పెంచుకునేందుకు అవకాశం లభిస్తుందని సంస్థ పేర్కొంది.
హైదరాబాద్ అమూల్ ప్యాకెట్ పాలు
హైదరాబాద్: అమూల్ బ్రాండ్ ప్యాకెట్ పాలు హైదరాబాద్లోనూ అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం సంస్థ ప్రతినిధులు ఇక్కడి మార్కెట్కు పరిచయం చేశారు. అమూల్ బ్రాండ్ గుజరాత్ కోఆపరేషన్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) పాలను ఉత్పత్తి చేస్తుండగా, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 1 కోటి లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు అమూల్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోని 70 లక్షల మంది వినియోగదారులకూ తమ పాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా, హైదరాబాద్లో ప్యాకెట్ పాలతోపాటు ప్యాకెట్ పెరుగును కూడా విక్రయించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధీ తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో తమ ఉత్పత్తులు వినియోగదారులకి లభిస్తాయన్నారు.
హైదరాబాద్ పాల ఉత్పత్తుల మార్కెట్లో 20 శాతం వాటాను సాధించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. అమూల్ టోన్డ్ పాలు లీటర్ ధర 38 రూపాయలైతే, గోల్ ఫుల్ క్రీమ్ పాలు లీటర్ 50 రూపాయలని వివరించారు.