For Quick Alerts
For Daily Alerts
మేక్ ఇన్ ఇండియా: రాజన్ విమర్శలను తోసిపుచ్చిన మంత్రి జైట్లీ(ఫోటోలు)
|
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన విమర్శలను కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం తోసిపుచ్చారు.
దేశంలో తయారీ రంగం అభివృద్ధి సవాలుగానే ఉందని అన్నారు. గత రెండేళ్లలో ఆర్ధిక మందగమనం చూశామని, ఐదే ఈ ఏడాది ఆర్ధికవృద్ధి మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారు చేసిన వస్తువులను ఎక్కడ విక్రయిస్తారన్నది ముఖ్యం కాదన్నారు. కంపెనీలు తమ ఉత్పత్తులను విదేశాలలో కూడా విక్రయించుకోవచ్చని అన్నారు.
భారత్లో తయారు చేసిన వస్తువుల నాణ్యత, ధరలే ముఖ్యమని ఆయన అన్నారు. ఎక్కువ మన్నిక కలిగిన వస్తువులు తక్కువ ధరలకు లభిస్తుంటే ప్రపంచ దేశాల వినియోగదారులు ఇక్కడి ఉత్పత్తులపై ఖచ్చితంగా ఆశక్తి చూపిస్తారని జైట్లీ అన్నారు.
డిసెంబర్ మొదటి వారంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై మాట్లాడుతూ మన దేశంలో జరిగిన వస్తువుల ఉత్పత్తి దేశీయ మార్కెట్లలో విక్రయాలు జరపాలని వ్యాఖ్యానించారు. సోమవారం
Comments
English summary
మేక్ ఇన్ ఇండియా: రాజన్ విమర్శలను తోసిపుచ్చిన మంత్రి జైట్లీ(ఫోటోలు) | FM Arun Jaitley rejects RBI Governor Raghuram Rajan’s criticism of ‘Make in India’
Story first published: Monday, December 29, 2014, 19:32 [IST]