'మూడేళ్లలో చైనాను ఇండియా అధిగమిస్తుంది, ముడిచమురు తగ్గడం ఓ వరం'

న్యూఢిల్లీ: రానున్న రెండు, మూడేళ్లలో వృద్ధి రేటులో చైనాను మన దేశం అధిగమిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. దేశంలో అంతర్గతంగా నెలకొన్న స్థిరత్వం మన దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతుందని అన్నారు.

2016-17, 2017-18 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్ధిక వ్యవస్ధ మనదే అవుతుందని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగివస్తుండటం కూడా భారత్ వృద్ధికి ఎంతో దోహదం చేస్తోందని అన్నారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముకేష్ అంబానీ ఈ వివరాలు వెల్లడించారు.

India to be fastest growing economy in 2-3 years: Mukesh Ambani

2014 సంవత్సరాన్ని మన దేశ చరిత్రలో అత్యంత అదృష్టకరమైన ఏడాదిగా ఆయన అభివర్ణించారు. మూడున్నర దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్న నేను, స్పష్టమైన ఆధిక్యతతో కూడిన ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నానని చెప్పారు.

అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 60 నుంచి 70 మధ్య ఉందని... మరో రెండేళ్లు ఇలాగే కొనసాగితే దేశానికి ఓ గిప్ట్ అని వివరించారు. 2004లో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్లు కాగా, గతంలోనే గరిష్టంగా 140 డాలర్లకు చేరిందని ఆయన గుర్తు చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+