రూ. కోటి బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లతో సచిన్(పిక్చర్స్)
నోయిడా: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల ఉత్పత్తి సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి నెక్ట్స్ జనరేషన్ ఎం3 సెడాన్తోపాటు కొత్త ఎం4 కూప్ కార్లను ప్రవేశపెట్టింది. ఢిల్లీ షోరూంలో ఎం3 కారు ధరను రూ.1.19 కోట్లుగా నిర్ణయించిన సంస్థ.. ఎం4 విలువ రూ.1.21 కోట్ల స్థాయిలో ఉంటుందని తెలిపింది.
కాగా, ఈ రెండు కార్లను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు. ఈ రెండు నూతన కార్లను ఇండియాలోని అసెంబ్లింగ్ ప్లాంట్లో రూపొందించినట్లు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వోన్ సహ్రా తెలిపారు. ఆరు సిలిండర్ ఇంజిన్తో తయారైన ఈ కారు బరువును తగ్గించినట్లు చెప్పారు.
ఈ వారం ప్రారంభంలో రూ.1.35 కోట్ల విలువైన ఎం5 సెడాన్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరిలోగా హైబ్రిడ్ కారైన ఐ8ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు ఫిలిప్ తెలిపారు. దేశవ్యాప్తంగా లగ్జరీ కార్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో సంస్థ వచ్చే ఏడాది చివరి నాటికి డీలర్ల సంఖ్యను 37 నుంచి 50కి పెంచుకోవాలని చూస్తోంది.
సచిన్ టెండూల్కర్
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల ఉత్పత్తి సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి నెక్ట్స్ జనరేషన్ ఎం3 సెడాన్తోపాటు కొత్త ఎం4 కూప్ కార్లను ప్రవేశపెట్టింది.
సచిన్ టెండూల్కర్
ఢిల్లీ షోరూంలో ఎం3 కారు ధరను రూ.1.19 కోట్లుగా నిర్ణయించిన సంస్థ.. ఎం4 విలువ రూ.1.21 కోట్ల స్థాయిలో ఉంటుందని తెలిపింది.
సచిన్ టెండూల్కర్
కాగా, ఈ రెండు కార్లను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు.
సచిన్ టెండూల్కర్
ఈ రెండు నూతన కార్లను ఇండియాలోని అసెంబ్లింగ్ ప్లాంట్లో రూపొందించినట్లు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వోన్ సహ్రా తెలిపారు. ఆరు సిలిండర్ ఇంజిన్తో తయారైన ఈ కారు బరువును తగ్గించినట్లు చెప్పారు.