న్యూఢిల్లీ: కొటాక్ మహేంద్ర బ్యాంక్లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనం కానుందని సమాచారం. ఇందుకు సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నాయని.. ఈ నెలాఖరులోగా ఒప్పంద విషయాన్ని ఇరు బ్యాంకులు ప్రకటించవచ్చని ఈటీనౌ టెలివిజన్ ఛానల్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
ఆ వార్తా కథనం ప్రకారం ఈ ఒప్పంద విలువ రూ. 16,500 కోట్లుగా ఉండనుందని విశ్వసనీయ సమాచారం. 2:2:5 నిష్పత్తిలో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ను కొటాక్ మహేంద్ర బ్యాంక్ విలీన చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై కొటాక్ మహేంద్ర బ్యాంక్ ప్రతినిధిని కోజెన్సిస్ సంప్రదించగా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. గతంలో కూడా ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ను టేకోవర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్సేనంటూ ఆ తర్వాత ఎల్ అండ్ టీ పైనాన్స్ హోల్డింగ్స్ కొట్టి పారేసింది.
ఇక కొటాక్ మహేంద్ర బ్యాంక్ విషయానికి వస్తే ఫిబ్రవరి 2003లో కొటాక్ మహేంద్ర ఫైనాన్స్ ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ లైసెన్సును పొందడంతో కొటాక్ మహేంద్ర బ్యాంకుగా అవతరించింది. భారత్లో బ్యాంకింగేతర ఆర్ధిక సంస్ధ (ఎన్బీఎఫ్సీ) బ్యాంకుగా మారడం అదే తొలిసారి కావడం విశేషం.

కొటాక్ చేతికి ఐఎన్జీ వైశ్యా..?
కొటాక్ మహేంద్ర బ్యాంక్లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనం కానుందని సమాచారం. ఆ వార్తా కథనం ప్రకారం ఈ ఒప్పంద విలువ రూ. 16,500 కోట్లుగా ఉండనుందని విశ్వసనీయ సమాచారం. 2:2:5 నిష్పత్తిలో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ను కొటాక్ మహేంద్ర బ్యాంక్ విలీన చేసుకోవచ్చని తెలుస్తోంది.

కొటాక్ చేతికి ఐఎన్జీ వైశ్యా..?
వైశ్యా బ్యాంకులో ఐఎన్జీ గ్రూప్ వాటా కోనుగోలు చేయడంతో 2002లో ఐఎన్జీ వైశ్యా బ్యాంకు ఏర్పడింది. ప్రధాన కేంద్రం బెంగుళూరు. ఒక దేశీయ బ్యాంకు, విదేశీ బ్యాంకు విలీనమై
కార్యకలాపాలను అందించడం అప్పటికి ఇదే ప్రధమం. 2013 నాటికి ఐఎన్జీ వైశ్యా బ్యాంకు దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుగా అవతరించింది. 20 లక్షల మందికి పైగా ఖాతాదారులకు సేవలందిస్తోంది. మొత్తం ఆస్తుల విలువ రూ. 54, 836 కోట్లు.

కొటాక్ చేతికి ఐఎన్జీ వైశ్యా..?
బ్యాంకు ప్రధాన వ్యవస్ధాపకుడు, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయ్ కొటక్. 1985లో అంటే 27 ఏల్ల వయసులోనే ఒక బ్యాంకు పెట్టాలన్న ఆలోచనతో కొటాక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ను స్ధాపించారు.
కొటాక్ చేతికి ఐఎన్జీ వైశ్యా..?
ఇక కొటాక్ మహేంద్ర బ్యాంక్ విషయానికి వస్తే ఫిబ్రవరి 2003లో కొటాక్ మహేంద్ర ఫైనాన్స్ ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ లైసెన్సును పొందడంతో కొటాక్ మహేంద్ర బ్యాంకుగా అవతరించింది. భారత్లో బ్యాంకింగేతర ఆర్ధిక సంస్ధ (ఎన్బీఎఫ్సీ) బ్యాంకుగా మారడం అదే తొలిసారి కావడం విశేషం.
బ్యాంకు ప్రధాన వ్యవస్ధాపకుడు, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయ్ కొటక్. 1985లో అంటే 27 ఏల్ల వయసులోనే ఒక బ్యాంకు పెట్టాలన్న ఆలోచనతో కొటాక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ను స్ధాపించారు. ఇక వైశ్యా బ్యాంకులో ఐఎన్జీ గ్రూప్ వాటా కోనుగోలు చేయడంతో 2002లో ఐఎన్జీ వైశ్యా బ్యాంకు ఏర్పడింది.
ప్రధాన కేంద్రం బెంగుళూరు. ఒక దేశీయ బ్యాంకు, విదేశీ బ్యాంకు విలీనమై
కార్యకలాపాలను అందించడం అప్పటికి ఇదే ప్రధమం. 2013 నాటికి ఐఎన్జీ వైశ్యా బ్యాంకు దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుగా అవతరించింది. 20 లక్షల మందికి పైగా ఖాతాదారులకు సేవలందిస్తోంది. మొత్తం ఆస్తుల విలువ రూ. 54, 836 కోట్లు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications