మళ్లీ రేట్లు పెంచిన ఎయిర్‌టెల్, డిసెంబర్ 3 నుంచి అమలు

న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్ డిసెంబర్ నెల నుంచి ఎంపిక చేసిన ప్లాన్స్‌లలో పోస్ట్ పెయిడ్ రెంటల్స్ 12 శాతం పెంచింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో డిసెంబర్‌ మూడో తేదీ నుంచి కొత్త రెంటల్స్‌ అమలులోకి వస్తాయని ప్రకటించింది.

దీని ప్రకారం నెలకు 199 రూపాయల ప్లాన్‌లో నెలవారీ రెంటల్‌ 224 రూపాయలవుతుంది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ తమ కస్టమర్లందరికీ సందేశాలు పంపింది. ఈ విషయంలో ఎయిర్‌టెల్‌ను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

 Airtel Hikes Post-Paid Rentals by 12 Per Cent in Delhi NCR

ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కస్టమర్లున్నారు. ఎయిర్ టెల్ సెప్టెంబర్ త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో నికరలాభం రూ. 1,383 కోట్లు. మొబైల్ డేటా ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కువ మొత్తంలో వృద్ది చెందిందని పేర్కొన్నారు.

మూడు నెలల కాల పరిమితిలో ఎయిర్‌టెల్‌ రేట్లు పెంచడం ఇది రెండో సారి. సెప్టెంబర్‌లో కంపెనీ మొబైల్‌ ఇంటర్నెట్‌ రేట్లను 33 శాతం మేరకు పెంచింది. ప్రీ పెయిడ్ వినియోగదారులకు ప్రయోజనాలను తగ్గించింది.

2జీ కుంభకోణంలో సుప్రీం కోర్టు కొన్ని స్పెక్ర్టమ్ లైసెన్సులను రద్దు చేయడంతో గత రెండు సంవత్సరాల్లో టెలికం సర్వీసులను అందిస్తున్న ప్రొవైడర్లు ఎక్కువ మొత్తంలో ప్రజల వద్ద నుండి డబ్బును లాగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+