న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లే అయింది. భారత్లో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ మొబైల్ కంపెనీ 'నోకియా' బ్రాండ్ పేరు మారింది. నోకియా స్ధానంలో 'మైక్రోసాప్ట్ లుమియా' పేరును అధికారికంగా మార్చినట్లు మైక్రోసాఫ్ట్ సంస్ధ తెలిపింది.
ఈ మేరకు నోకియా ఫ్రాన్స్ ఫేస్ బుక్ పేజ్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా పేజీలలో మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. "ఇతర దేశాలు కూడా మార్చిన బ్రాండ్ పేరును ఉపయోగించేలా త్వరలో చర్యలు తీసుకుంటాం" అని తెలిపింది.
తొలిసారిగా ఫ్రాన్స్ నుంచే మైక్రోసాప్ట్ లుమియా పేరు వాడుకలోకి రానుంది. అటు స్మార్ట్ ఫోన్లలో కూడా నోకియా పేరును మైక్రోసాఫ్ట్ తీసివేయనుంది. నెట్వర్క్స్, మ్యాపింగ్ సర్వీసెస్, టెక్నాలజీ డెవలప్ మెంట్, లైసెన్స్ విషయాలపై దృష్టి పెట్టనుంది.

ఫిన్ల్యాండ్ దేశపు నోకియా కంపెనీ మొబైల్ తయారీ యూనిట్ను 7.2 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఈ విక్రయంతో నోకియాలో పనిచేస్తున్న 16వేల మంది ఉద్యోగులు కూడా మైక్రోసాప్ట్ పరిధిలోనికి వచ్చారు. ప్రస్తుతం నోకియా వినియోగించే అన్ని వ్యవస్థల లైసెన్సుల కోసం కూడా మైక్రోసాప్ట్ పదికోట్ల డాలర్లను వెచ్చించింది.
స్మార్ట్ఫోన్ మార్కెట్లో యాపిల్, శ్యాసంగ్ సత్తా చాటుతూ నోకియా మార్కెట్ వాటాకు గండి కొట్టాయి. 2007లో యాపిల్ కంప్యూటర్స్ ఐఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడంతో నోకియా ఫోన్లను కొనేవారి సంఖ్య మరింతగా తగ్గారు. ఇక
మధ్యతరహా సెల్ఫోన్లు కొనే వారి దృష్టి శ్యాసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ల మీదకు మళ్లింది. దీంతో నోకియా కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి చివరకు మూసివేయాల్సిన పరిస్ధితికి వచ్చింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications