రిలయన్స్: రంగంలోకి వారసులు (ఫోటోలు)

న్యూఢిల్లీ: రిలయన్స్ సామ్రాజ్యంలోకి మూడోతరం అరంగేట్రం చేసింది. మకేష్ అంబానీ కవల పిల్లలైన 23ఏళ్ల ఈశా, ఆకాశ్‌లు రిలయన్స్‌లో భాగమైన టెలికం, రిటైల్ వెంచర్ల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఇషా, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు ఆకాశ్‌ డైరెక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ తెలిపింది.

శనివారం రిలయన్స్ జియో ఇన్పోకామ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డు సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్బంగా వీరిద్దరి నియామక ప్రతిపదనలకు ఆమోదం లభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వివరించింది. అలాగే ఆరఐఎల్‌లో ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న అదిల్ జైనుల్ బాయ్‌ను రిలయన్స్ రిటైల్ బోర్డులో నియమితులైనట్లు కంపెనీ పేర్కొంది.

మకేష్ అంబానీకి మొత్తం ముగ్గురు సంతానం. ఇషా, ఆకాశ్ (23) కవల పిల్లలు. చివరివాడైన అనంత్ ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. 1981లో ముకేశ్ అంబానీ రిలయన్స్‌లో చేరే నాటికి వయసు 24 సంవత్సరాలు. ప్రస్తుతం ఇషా, ఆకాశ్ కూడా దాదాపు అదే వయసులో కంపెనీ చేరడం విశేషం.

సైకాలజీలో ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొన్ని కాలం పాటు అమెరికాలో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్ద మెకిన్సేలో కూడా పనిచేశారు. ఇక ఆర్దిక శాస్త్రంలో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆకాశ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆర్ఐఎల్ టెలికం వెంచర్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.

16ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల వారసుల్లో పిన్న వయస్కులకు సంబంధించిన పోర్బ్స్ జాబితాలో ఇషా అంబానీ రెండో స్దానంలో నిలిచారు. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగ కంపెనీ అయిన ఆర్ఐఎల్ టర్వోవర్ రూ. 4,46,339 కోట్లు కాగా 2013-14లో సంస్ద నికరలాభం రూ. 22,493 కోట్లు. టెలికం సర్వీసుల కోసం ప్రత్యేకంగా రిలయన్స్ జియో ఇన్పోకామ్‌ను నెలకొల్పింది. దేశ వ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో బ్రాడ్ బ్యాండ్ వైర్ లెస్ స్పెక్ట్రం దక్కించుకున్న ఏకైక ప్రైవేట్ సంస్ద రిలనయ్స్ జియో.

రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు

రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు

రిలయన్స్ సామ్రాజ్యంలోకి మూడోతరం అరంగేట్రం చేసింది. మకేష్ అంబానీ కవల పిల్లలైన 23ఏళ్ల ఈశా, ఆకాశ్‌లు రిలయన్స్‌లో భాగమైన టెలికం, రిటైల్ వెంచర్ల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. సైకాలజీలో ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొన్ని కాలం పాటు అమెరికాలో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్ద మెకిన్సేలో కూడా పనిచేశారు.

 రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు

రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు

రిలయన్స్ సామ్రాజ్యంలోకి మూడోతరం అరంగేట్రం చేసింది. మకేష్ అంబానీ కవల పిల్లలైన 23ఏళ్ల ఈశా, ఆకాశ్‌లు రిలయన్స్‌లో భాగమైన టెలికం, రిటైల్ వెంచర్ల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇక ఆర్దిక శాస్త్రంలో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆకాశ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆర్ఐఎల్ టెలికం వెంచర్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.

రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు

రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు

1981లో ముకేశ్ అంబానీ రిలయన్స్‌లో చేరే నాటికి వయసు 24 సంవత్సరాలు. ప్రస్తుతం ఇషా, ఆకాశ్ కూడా దాదాపు అదే వయసులో కంపెనీ చేరడం విశేషం. ముకేష్ అంబానీకి మొత్తం ముగ్గురు సంతానం. ఇషా, ఆకాశ్ (23) కవల పిల్లలు. చివరివాడైన అనంత్ ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు.
రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు

రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు

దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగ కంపెనీ అయిన ఆర్ఐఎల్ టర్వోవర్ రూ. 4,46,339 కోట్లు కాగా 2013-14లో సంస్ద నికరలాభం రూ. 22,493 కోట్లు. టెలికం సర్వీసుల కోసం ప్రత్యేకంగా రిలయన్స్ జియో ఇన్పోకామ్‌ను నెలకొల్పింది. దేశ వ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో బ్రాడ్ బ్యాండ్ వైర్ లెస్ స్పెక్ట్రం దక్కించుకున్న ఏకైక ప్రైవేట్ సంస్ద రిలనయ్స్ జియో.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+