హైదరాబాద్: స్టార్టప్లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందిన తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా కృషి చేసిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒక్కతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘ఆగస్టు ఫెస్ట్-2014' ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండు రోజులపాటు ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐబిఎస్)లో జరుగనుందని చెప్పారు.
ఇప్పటి వరకు మనదేశంలో జరిగిన సదస్సులలో ఇదే అతిపెద్ద స్టార్టప్ పండుగని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ సదస్సుకు సుమారు 1500మంది ఔత్సాహిక పారిశ్రామిక వత్తేలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. సరికొత్త ఆలోచనలు ఉండి నిధులు లేక సతమతమవుతున్న వారికి ఈ వేదిక అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందన్నారు.
నిరుడు నిర్వహించిన ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా 400 నుంచి 500మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొనగా.. ఈసారి ఆ సంఖ్య మూడింతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రెండో ఎడిషన్ కొత్త ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎంతో లాభసాటిగా ఉండనుందని ఈట్ స్లిప్ డ్రింక్(ఈఎస్డి) సహ వ్యవస్థాపకుడు సురేష్ తెలిపారు.
హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఇంక్యూబేటర్ ఈ ఏడాది చివర్లోగా లేదా వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వస్తుందని కెటిఆర్ చెప్పారు. మొదటి దశలో 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్లో సుమారు 400 స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి వీలుంటుందని తెలిపారు.

కెటిఆర్
స్టార్టప్లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందిన తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు.

కెటిఆర్
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా కృషి చేసిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఒక్కతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘ఆగస్టు ఫెస్ట్-2014' ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండు రోజులపాటు ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐబిఎస్)లో జరుగనుందని చెప్పారు.

కెటిఆర్
ఇప్పటి వరకు మనదేశంలో జరిగిన సదస్సులలో ఇదే అతిపెద్ద స్టార్టప్ పండుగని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

కెటిఆర్
ఈ సదస్సుకు సుమారు 1500మంది ఔత్సాహిక పారిశ్రామిక వత్తేలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఇంక్యూబేటర్ ఈ ఏడాది చివర్లోగా లేదా వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వస్తుందని కెటిఆర్ చెప్పారు.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications