హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలని, అలా పెట్టుబడులను ప్రోత్సహించాలంటే కంపెనీ సెక్రటరీల సహకారం ఈ నూతన రాష్ట్రానికి అవసరమని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో పెట్టుబడులకు ఢోకా లేదని చెప్పారు. ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా' రెండు రోజుల ప్రాంతీయ సమావేశం ఆదివారం ముగిసింది.
ఈ సందర్భంగా జరిగిన హైదరాబాద్ చాప్టర్ 40వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రసంగించారు. కంపెనీ యజమానులకు కంపెనీ సెక్రటరీలే దిక్సూచీలని, కంపెనీ సెక్రటరీల మీదే ఈ రాష్ర్ట భవిష్యత్ ఆధారపడి ఉందని అన్నారు. గత రెండు నెలల్లో రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా ఉందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అన్నారు.

రాష్ర్ట విభజన తర్వాత, తామెక్కడున్నామో తెలిస్తే తప్ప బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యం కాదని, అందుకే 19వ తేదీన సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామన్నారు. దీని నిర్వహణ వెనుక కొందరు ఊహిస్తున్నట్లుగా మరే ఇతర కారణాలు లేవని చెప్పారు. ఈ సర్వే కార్యక్రమంలో అంతా పాల్గొనాలని కోరారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్థ సభ్యులకు ఈటెల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు.
కంపెనీ సెక్రటరీ కోర్సులలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పతకాలు బహూకరించారు. కంపెనీ సెక్రటరీలుగా ఉపాధి అవకాశాలు బాగా ఉంటాయని హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు వాసుదేవరావు దేవకి తెలిపారు. ప్రభుత్వ కార్పోరేషన్లకు కంపెనీ సెక్రటరీలను నియమించాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను సంస్థ కోశాధికారి ఏవి రావు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు సుధీర్బాబు కోరారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications