హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వెలుపల కొత్తగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా (అసోచామ్) సూచించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, రాజధాని మధ్యన ఉన్న అంతరాలను పూడ్చాలంటే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరింది.
గురువారం ‘తెలంగాణలో వాస్తవిక వృద్ధికి అవకాశాలు(రియలైజింగ్ గ్రోత్ పొటెన్షియల్ ఆఫ్ తెలంగాణ)' అనే పేరుతో రూపొందించిన నివేదికను అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్, సదరన్ రీజినల్ కౌన్సిల్ చైర్మన్ రవీంద్ర సన్నారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రావత్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవాలంటే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, దీని ద్వారా పెద్ద ఎత్తున వ్యయాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు.

సరళీకృతమైన విధానాల అమలుతో పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోవచ్చని ఆ దిశగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అసోచాం రూపొందించిన నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, సంబంధిత శాఖలకు అందజేసినట్లు రావత్ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 3,555 కోట్ల రూపాయల మిగులు ఉండనుందని అసోచామ్ నివేదిక పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రుణ భారం 1.45 లక్షల కోట్ల రూపాయలుండగా రాష్ట్ర విభజన అనంతరం జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై 61 వేల కోట్ల రూపాయల రుణ భారం పడిందని తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
జూన్ చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న పెట్టుబడుల మొత్తం 3.3 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని డిఎస్ రావత్ అన్నారు. ఇందులో రియల్ ఎస్టేట్ రంగం వాటా 28 శాతం, సర్వీసుల వాటా (ఫైనాన్షియల్ రంగం మినహాయించి) 23 శాతం, ఎలకి్ట్రసిటీ 19 శాతం, నీటిపారుదల 16.5 శాతం, ఉత్పత్తుల రంగం 12 శాతంగా ఉండగా 1 శాతం పె ట్టుబడులు మైనింగ్లో ఉన్నాయని తెలిపారు. అయితే ప్ర స్తుతం ఎన్ని ప్రాజెక్టుల్లో కార్యకలాపాలు సాగుతున్నాయనేది మాత్రం అసోచామ్ నివేదిక వెల్లడించలేదు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రైవేట్ పెట్టుబడుల వాటా 59 శాతంగా ఉన్నాయని తెలిపింది. అయితే దాదాపు 30 శాతం పెట్టుబడులు మాత్రం భూసేకరణ, క్లియరెన్సులు రాకపోవటం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నివేదిక పే ర్కొంది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టుకునేందుకు గాను డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించనున్నట్లు డిఎస్ రావత్ వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తిని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసోచామ్ నివేదిక కోరింది. థర్మల్ విద్యుత్తో పాటు సౌర విద్యుత్పై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించింది.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications