హైదరాబాద్: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్కెట్లోకి 4జి మొబైళ్లను తీసుకురావాల్సి ఉందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సాంకేతికతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే త్వరలోనే హైదరాబాద్లో 4జి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. సెల్కాన్ మొబైల్ తమ కొత్త మోడల్స్ మిలీనియం పవర్ క్యూ 3000, మిలీనియం ఎలైట్ క్యూ 470లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై మొబైల్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో విదేశీ తయారీ సెల్ఫోన్ల హవా నడుస్తోందని, వాటి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా టెక్నాలజీలో దేశీయ కంపెనీ అయిన సెల్కాన్ మొబైల్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సెల్కాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ ఉన్న మొబైళ్లను సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ధరలో అందించడం గొప్ప విషయమన్నారు.

కెటిఆర్
సెల్కాన్ మొబైల్ తమ కొత్త మోడల్స్ మిలీనియం పవర్ క్యూ 3000, మిలీనియం ఎలైట్ క్యూ 470లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు మొబైల్స్ను ఆవిష్కరించారు.

కెటిఆర్
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్కెట్లోకి 4జి మొబైళ్లను తీసుకురావాల్సి ఉందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.

కెటిఆర్
ప్రస్తుతం మార్కెట్లో విదేశీ తయారీ సెల్ఫోన్ల హవా నడుస్తోందని, వాటి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా టెక్నాలజీలో దేశీయ కంపెనీ అయిన సెల్కాన్ మొబైల్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కెటిఆర్
సెల్కాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ ఉన్న మొబైళ్లను సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ధరలో అందించడం గొప్ప విషయమన్నారు.

కెటిఆర్
మూడు, నాలుగు నెలల్లోనే అత్యాధునిక పరిజ్ఞానంతో 4జి మొబైళ్లను రూపొందిస్తామని వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి 4జి మొబైల్స్ తామే మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపారు.
మూడు, నాలుగు నెలల్లోనే అత్యాధునిక పరిజ్ఞానంతో 4జి మొబైళ్లను రూపొందిస్తామని సెల్కాన్ సిఎండి గురు వెల్లడించారు. దేశంలో మొట్టమొదటి 4జి మొబైల్స్ తామే మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపారు. మిలీనియం మోడళ్ల ప్రత్యేకతలు సెల్కాన్ మొబైల్స్ ఈడి మురశీ మాట్లాడుతూ.. కొత్త మోడళ్ల ప్రత్యేకతలను వివరించారు.
మిలీనియం పవర్ క్యూ 3000 కిట్కాట్ ఓఎస్, 1.3 జిహెచ్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 ఇంచుల డిస్ప్లే, 9.9 ఎంఎం మందం, 1జిబి ర్యామ్, 4 జిబి రోమ్ కలిగి ఉండడంతోపాటు 3000 ఎంఎహెచ్ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని వివరించారు. 8 మెగా పిక్సల్ రీయర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32 జిబి ఎక్స్స్పాండబుల్ మొమొరీ సౌకర్యం కలిగి ఉన్న ఈ మొబైల్ ధర కేవలం రూ. 8999 అని చెప్పారు. అలాగే మిలీనియం ఎలైట్ క్యూ 470 మోడల్ స్మార్ట్ఫోన్ కూడా కిట్కాట్ ఓఎస్, 16 జిబి రోమ్, 1 జిబి ర్యామ్, 1.3 జిహెచ్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుందన్నారు. ఈ మోడల్ ధర రూ. 11,999 అని తెలిపారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications