అనంతపురం: శిల్పకళలకు నిలయమైన లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోకపోవడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. లేపాక్షి శిల్సకళ అద్భుతమని కొనియాడారు. లేపాక్షిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన పూర్తైందని, అధికారుల విభజన ఇంకా పూర్తికాలేదని ఆయన తెలిపారు. ఈనెల 19నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నట్లు గవర్నర్ తెలియజేశారు.
గురువారం ఆయన జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం, ఏకశిలా నంది విగ్రహాలను గవర్నర్ గురువారం సతీసమేతంగా సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1971లో తాను ఐపిఎస్ అధికారిగా శిక్షణ పొందేందుకు అనంతపురం వచ్చినప్పుడు లేపాక్షి శిల్పకళా వైభవం, చరిత్ర గురించి తెలుసుకున్నానన్నారు. గవర్నర్ హోదాలో ఆలయాన్ని సందర్శించడం ఎంతో అదృష్టమన్నారు.
వీరభద్రస్వామి, దుర్గాదేవిల దర్శనంతో సౌభాగ్యం దక్కినట్లయిందన్నారు. లేపాక్షి ఆలయంలో శిల్పకళలు అద్భుతమన్నారు. లేపాక్షిలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పట్టుచీరలు తయారు చేయించి విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. శిల్పకళలు, నంది విగ్రహం, శివపార్వతుల అసంపూర్తి కళ్యాణమంటపం చరిత్ర, లతామంటపం, నాట్య మంటపం, డిజైన్లు, సీత పాదం, ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు గైడ్ల ద్వారా వివరిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
లేపాక్షిని ప్రముఖ టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని గవర్నర్ అన్నారు. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో ఇటీవల వినాయక విగ్రహం అపహరణకు గురికాగా అధికార యంత్రాంగం దాన్ని బయట పెట్టలేదని మీడియా గవర్నర్ దృష్టికి తీసుకురాగా దేవుని విగ్రహాన్ని ఎత్తుకెళ్ళడం మహాపాపమన్నారు. అదంతా దేవుడే చూసుకుంటారంటూ చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ లోకేష్కుమార్, దేవాదాయశాఖ సహాయ సంచాలకులు మల్లికార్జున పాల్గొన్నారు.

గవర్నర్ నర్సింహన్
శిల్పకళలకు నిలయమైన లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోకపోవడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షి శిల్సకళ అద్భుతమని కొనియాడారు. లేపాక్షిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు.

గవర్నర్ నర్సింహన్
గురువారం ఆయన జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం, ఏకశిలా నంది విగ్రహాలను గవర్నర్ గురువారం సందర్శించారు.

గవర్నర్ నర్సింహన్
ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1971లో తాను ఐపిఎస్ అధికారిగా శిక్షణ పొందేందుకు అనంతపురం వచ్చినప్పుడు లేపాక్షి శిల్పకళా వైభవం, చరిత్ర గురించి తెలుసుకున్నానన్నారు.

గవర్నర్ నర్సింహన్
గవర్నర్ హోదాలో లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం ఎంతో అదృష్టమని నర్సింహన్ అన్నారు.

గవర్నర్ నర్సింహన్
వీరభద్రస్వామి, దుర్గాదేవిల దర్శనంతో సౌభాగ్యం దక్కినట్లయిందన్నారు. లేపాక్షి ఆలయంలో శిల్పకళలు అద్భుతమన్నారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షిలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పట్టుచీరలు తయారు చేయించి విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

గవర్నర్ నర్సింహన్
శిల్పకళలు, నంది విగ్రహం, శివపార్వతుల అసంపూర్తి కళ్యాణమంటపం చరిత్ర, లతామంటపం, నాట్య మంటపం, డిజైన్లు, సీత పాదం, ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు గైడ్ల ద్వారా వివరిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షిని ప్రముఖ టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని గవర్నర్ అన్నారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో ఇటీవల వినాయక విగ్రహం అపహరణకు గురికాగా అధికార యంత్రాంగం దాన్ని బయట పెట్టలేదని మీడియా గవర్నర్ దృష్టికి తీసుకురాగా దేవుని విగ్రహాన్ని ఎత్తుకెళ్ళడం మహాపాపమన్నారు.

గవర్నర్ నర్సింహన్
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ నర్సింహన్ వెంట కలెక్టర్ లోకేష్కుమార్, దేవాదాయశాఖ సహాయ సంచాలకులు మల్లికార్జున పాల్గొన్నారు.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications