హైదరాబాద్: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికిగానూ ల్యాంకో ఇన్ఫ్రాటెక్ 584 కోట్ల రూపాయల నష్టాలను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నష్టాలు 31.6 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. విద్యుత్, ఇపిసి విభాగాల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవటంతోపాటు త్రైమాసిక కాలంలో కంపెనీ రాబడి 23 శాతం క్షీణించి 2,762 కోట్ల రూపాయలకు పడిపోవటం వంటి అంశాలు ప్రభావం చూపించాయని ల్యాంకో ఇన్ఫ్రా వెల్లడించింది.
నిరుడు చివరి త్రైమాసికంలో రాబడి 3,570 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర నష్టాలు ఏకంగా 1,073 కోట్ల రూపాయల నుంచి 2,273.90 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ కాలంలో రాబడి కూడా 29 శాతం క్షీణించి 15,296 కోట్ల రూపాయల నుంచి 10,875 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.

నాలుగో త్రైమాసికం తోపాటు నిరుటి ఆర్థిక సంవత్సరంలో కాంట్రాక్టుల నిర్వహణలో జాప్యం తలెత్తటంతో పాటు వ్యయాలు, ధరలు పెరిగిపోవటంతో భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చిందని లాంకో పేర్కొంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇపిసి రాబడి ఏకంగా 48 శాతం క్షీణించి 4,345 కోట్ల రూపాయల నుంచి 2,255 కోట్ల రూపాయలకు పడిపోయాయని కంపెనీ పేర్కొంది.
ఇదే సమయంలో గ్రిఫిన్ కోల్ మైన్ రాబడి 65 శాతం తగ్గి 411 కోట్ల రూపాయల నుంచి 145 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని పేర్కొంది. మరోవైపు విద్యుత్ విభాగంలో మార్చి చివరి నాటికి వివిధ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి 2,823 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications