ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచి సెన్సెక్స్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 25,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన సెన్సెక్స్ 1,109 పాయింట్లు పెరిగి ఒకానొక దశలో 25, 014 స్థాయికి చేరుకుంది.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వెలువడుతుండటంతో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ కూడా భారీ స్థాయిలో పెరిగింది. 336 పాయింట్లు పెరిగి.. 7,459 మార్క్ను అందుకుంది. మరోవైపు రూపాయి కూడా దూసుకెళుతోంది. 2013 తర్వాత 59 పైసలు బలపడింది.

గురువారం కూడా మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేశాయి. గురువారం స్టాక్ మార్కెట్లు పటిష్ఠమైన స్థితిలో ప్రారంభమైనాయి. ప్రారంభ దశలోనే సెన్సెక్స్ 23,971.78 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరుకుంది.
అయితే రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఐటి, లోహ, హెల్త్కేర్ రంగాలకు చెందిన షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా ఆ తర్వాత ఒక దశలో 23,742.75 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినా చివర్లో హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లతో 90.48 పాయింట్ల వృద్ధితో 23,905.60 పాయింట్ల సరికొత్త ముగింపు రికార్డును నమోదు చేసుకుంది. ముఖ్యంగా టాటా స్టీల్ స్టాక్స్ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
More From GoodReturns

ఇరాన్ దాడుల తర్వాత దుబాయ్ తిరిగి సాధారణ స్థితికి.. నేడు మార్కెట్లు ఓపెన్.. తగ్గిన సంక్షోభం ప్రభావం..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications