న్యూయార్క్/న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో నమోదైన ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన పబ్లిక్ కంపెనీల్లో భారత కంపెనీలు సత్తా చాటుకుంటున్నాయి. 2,000 కంపెనీలతో ఫోర్బ్స్ విడుదల చేసిన వార్షిక జాబితాలో 54 భారత కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ కంపెనీల్లో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ రాబడి, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా కంపెనీల జాబితాను రూపొందించారు.
2,000 కంపెనీల్లో తొలి మూడు స్థానాలను చైనా పబ్లిక్ కంపెనీలే సొంతం చేసుకోవడం విశేషం. టాప్ 10 కంపెనీల్లో ఐదు కంపెనీలు చైనావే ఉన్నాయి. మొత్తం కంపెనీల్లో 564 పబ్లిక్ కంపెనీలు యుఎస్కు చెందినవే కావడం గమనార్హం. యుఎస్ తర్వాత 225 కంపెనీలతో జపాన్ ద్వితీయ స్థానంలో ఉంది. ఫోర్బ్స్ జాబితాలో చైనీస్ బ్యాంక్ ఐసిబిసి వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనా కన్స్ట్రక్షన్ బ్యాంకు, మూడో స్థానంలో అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉన్నాయి.
ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 62 దేశాల కంపెనీలు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మొత్తం 2,000 కంపెనీల రాబడి 38 లక్షల కోట్ల డాలర్లుండగా.. లాభం 3 లక్షల కోట్ల డాలర్లు, ఆస్తుల విలువ 161 కోట్ల డాలర్లు, మార్కెట్ విలువ 44 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. నిరుడితో పోల్చితే కంపెనీల మార్కెట్ విలువ 13 శాతానికి పైగా పెరిగింది. ఈ కంపెనీలన్నీ ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయని ఫోర్బ్స్ వెల్లడించింది.

ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 135వ స్థానంలో నిలిచింది. 2014 మే వరకు ఈ కంపెనీ మార్కెట్ విలువ 5,090 కోట్ల డాలర్లుగా ఉంది. ఆర్ఐఎల్ తర్వాత వరుసగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (155వ స్థానం - 2,360 కోట్ల డాలర్లు), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (176వ ), ఐసిఐసిఐ బ్యాంకు (304), టాటా మోటార్స్ (332), ఇండియన్ ఆయిల్ (416), హెచ్డిఎఫ్సి బ్యాంకు (422), కోల్ ఇండియా (428), లార్సన్ అండ్ టూబ్రో (500), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (543), భారతీ ఎయిర్టెల్ (625), యాక్సిస్ బ్యాంక్ (630), ఇన్ఫోసిస్ (727)తోపాటు తదితర 54 కంపెనీలున్నాయి.
‘రూపే' కార్డును జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశీయంగా వీసా, మాస్టర్ కార్డులతో పోల్చితే సరిసమాన సేవలు అందించే రూపే కార్డును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం జాతికి అంకితం చేశారు. ఏటిఎంలతోపాటు వ్యాపార ఔట్లెట్లు, ఆన్లైన్ విక్రయాల్లో పనిచేసే ఈ కార్డును రాష్టప్రతి భవన్లో జరిగిన వేడుకలో ఆవిష్కరించిన అనంతరం ప్రణబ్ ముఖర్జీ జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారు.
వినియోగదారులకు చెల్లింపుల విషయంలో బహుళ ప్రయోజనాలను అందించే ఈ కార్డు.. నగదు లావాదేవీలను తగ్గించడమేగాక, సురక్షితమైన లావాదేవీలకు దోహదం చేస్తుందని ప్రణబ్ తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) అభివృద్ధి చేసిన ఈ కార్డు ఐసిఐసిఐ, ఎస్బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు తదితర బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీల నిమిత్తం వినియోగించవచ్చు. భారత్లో ఈ కార్డు ప్రారంభంతో ప్రపంచంలో ఈ తరహా కార్డులను పరిచయం చేసిన దేశాల సంఖ్య ఏడుకు చేరింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications