ఐటిలో టిసిఎస్ జోరు: మార్కెట్లకు ఎఫ్ఐఐ వెల్లువ

TCS named fastest growing IT services brand
న్యూఢిల్లీ/ముంబై: అంతర్జాతీయ సమాచార సాంకేతిక సేవల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా దేశీయ ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) నిలిచింది. ఇతర ఐటి దిగ్గజాలైన ఐబిఎం, హ్యులెట్ పాకార్డ్‌లను అధిగమించి టిసిఎస్ అగ్రస్థానంలో నిలిచిందని గ్లోబల్ బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించింది. 2013-14లో టిసిఎస్ బ్రాండ్ విలువ ఏకంగా 58 శాతం వృద్ధి చెంది 820 కోట్ల డాలర్లకు చేరుకుందని బ్రాండ్ ఫైనాన్స్ పేర్కొంది.

2010లో 230 కోట్ల డాలర్లుగా ఉన్న టిసిఎస్ బ్రాండ్ విలువ 2014 నాటికి ఏకంగా నాలుగింతలు పెరిగిందని పేర్కొంది. 2013లో కంపెనీ బ్రాండ్ విలువ 520 కోట్ల డాలర్లుగా ఉంది. అంతేకాకుండా టిసిఎస్ బ్రాండ్‌కు ఎఎ ప్లస్ రేటింగ్‌ను బ్రాండ్ ఫైనాన్స్ ప్రకటించింది. కాగా 2014లో ఐబిఎం బ్రాండ్ విలువ పది శాతం వృద్ధి చెంది 4,150 డాలర్లకు, హెచ్‌పి బ్రాండ్ విలువ 23 శాతం పెరిగి 1,980 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2013లో డిజిటల్ సర్వీసులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిపోవటంతో టిసిఎస్ వ్యాపారం అత్యంత వేగంగా వృద్ధి చెందటంతో కంపెనీకి అగ్రస్థానం లభించిందని సంస్థ సిఇఒ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.

మార్కెట్లకు ఎఫ్ఐఐ వెల్లువ

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఉదయం ప్రారంభం నుంచే దూకుడు మీదున్న సూచీలు ముగింపు సమయానికి నూతన ఆల్‌టైమ్ హై వద్ద స్థిరపడ్డాయి. మదుపర్ల ఉత్సాహంతో 300.16 పాయింట్లు బలపడిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 22,055.48 పాయింట్ల వద్ద నిలిచింది. దీంతో మార్చి 10న నమోదైన ఆల్‌టైమ్ హై 21,934.83 స్థాయి కనుమరుగైంది.

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 88.60 పాయింట్లు పుంజుకుని 6,583.50 స్థాయికి చేరి మరో కొత్త ఆల్‌టైమ్ హై ముగింపునకు తెరతీసింది. ఇక ఇంట్రా-డే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 22,074.34 స్థాయిని తాకి ఇంతకుముందు మార్చి 18న నమోదైన 22,040.72 స్థాయిని చెరిపేసింది. నిఫ్టీ కూడా 6,591.50 స్థాయిని అందుకుంది. సోమవారం మొత్తంగా 155 షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. బ్యాంకింగ్, రిఫైనరీ, మెటల్, ఆటో, పవర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపర్ల నుంచి మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. 2.73 శాతం నుంచి 0.83 శాతం మేర లాభాలను అందుకున్నాయ.

ముఖ్యంగా రాబోయే సాధారణ ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, ఏప్రిల్ 1న జరిపే ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందన్న అంచనాలతో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) బ్యాంకింగ్ రంగ షేర్లపై అమితాసక్తిని ప్రదర్శించారు. అయితే ఔషధ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఐటి రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. గురువారంతో ముగుస్తున్న మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు సైతం దేశీయ మార్కెట్లకు కలిసోచ్చిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దేశీయ స్టాక్‌మార్కెట్లు కొత్త రికార్డులను అందుకోవడంలో విదేశీ సంస్థాగత మదుపర్ల పాత్ర కీలకమైనదని, మార్చి 20 వరకు వారు 17,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారని వెరాసిటి బ్రోకింగ్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి జిగ్నేశ్ చౌధరి అన్నారు. కాగా, గెయిల్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి, ఒఎన్‌జిసి, టిసిఎస్, హెచ్‌యుఎల్, ఎల్‌అండ్‌టి, ఐటిసి షేర్లు 4.81 శాతం నుంచి 1.11 శాతం మధ్య లాభాలను పొందాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+