
2010లో 230 కోట్ల డాలర్లుగా ఉన్న టిసిఎస్ బ్రాండ్ విలువ 2014 నాటికి ఏకంగా నాలుగింతలు పెరిగిందని పేర్కొంది. 2013లో కంపెనీ బ్రాండ్ విలువ 520 కోట్ల డాలర్లుగా ఉంది. అంతేకాకుండా టిసిఎస్ బ్రాండ్కు ఎఎ ప్లస్ రేటింగ్ను బ్రాండ్ ఫైనాన్స్ ప్రకటించింది. కాగా 2014లో ఐబిఎం బ్రాండ్ విలువ పది శాతం వృద్ధి చెంది 4,150 డాలర్లకు, హెచ్పి బ్రాండ్ విలువ 23 శాతం పెరిగి 1,980 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2013లో డిజిటల్ సర్వీసులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిపోవటంతో టిసిఎస్ వ్యాపారం అత్యంత వేగంగా వృద్ధి చెందటంతో కంపెనీకి అగ్రస్థానం లభించిందని సంస్థ సిఇఒ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
మార్కెట్లకు ఎఫ్ఐఐ వెల్లువ
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఉదయం ప్రారంభం నుంచే దూకుడు మీదున్న సూచీలు ముగింపు సమయానికి నూతన ఆల్టైమ్ హై వద్ద స్థిరపడ్డాయి. మదుపర్ల ఉత్సాహంతో 300.16 పాయింట్లు బలపడిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 22,055.48 పాయింట్ల వద్ద నిలిచింది. దీంతో మార్చి 10న నమోదైన ఆల్టైమ్ హై 21,934.83 స్థాయి కనుమరుగైంది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 88.60 పాయింట్లు పుంజుకుని 6,583.50 స్థాయికి చేరి మరో కొత్త ఆల్టైమ్ హై ముగింపునకు తెరతీసింది. ఇక ఇంట్రా-డే ట్రేడింగ్లో సెన్సెక్స్ 22,074.34 స్థాయిని తాకి ఇంతకుముందు మార్చి 18న నమోదైన 22,040.72 స్థాయిని చెరిపేసింది. నిఫ్టీ కూడా 6,591.50 స్థాయిని అందుకుంది. సోమవారం మొత్తంగా 155 షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. బ్యాంకింగ్, రిఫైనరీ, మెటల్, ఆటో, పవర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపర్ల నుంచి మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. 2.73 శాతం నుంచి 0.83 శాతం మేర లాభాలను అందుకున్నాయ.
ముఖ్యంగా రాబోయే సాధారణ ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని, ఏప్రిల్ 1న జరిపే ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందన్న అంచనాలతో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) బ్యాంకింగ్ రంగ షేర్లపై అమితాసక్తిని ప్రదర్శించారు. అయితే ఔషధ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఐటి రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. గురువారంతో ముగుస్తున్న మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు సైతం దేశీయ మార్కెట్లకు కలిసోచ్చిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దేశీయ స్టాక్మార్కెట్లు కొత్త రికార్డులను అందుకోవడంలో విదేశీ సంస్థాగత మదుపర్ల పాత్ర కీలకమైనదని, మార్చి 20 వరకు వారు 17,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారని వెరాసిటి బ్రోకింగ్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి జిగ్నేశ్ చౌధరి అన్నారు. కాగా, గెయిల్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి, ఒఎన్జిసి, టిసిఎస్, హెచ్యుఎల్, ఎల్అండ్టి, ఐటిసి షేర్లు 4.81 శాతం నుంచి 1.11 శాతం మధ్య లాభాలను పొందాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications